Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఉప్పెన తరువాత మొదటిసారి సరికొత్తగా దర్శనమిచ్చిన వైష్ణవ్ తేజ్.. న్యూ స్టైలిష్ లుక్!
టాలీవుడ్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయిలో క్లిక్కవుతుందని సుకుమార్ తప్పితే ఎవరు ఊహించలేదు. మొత్తానికి నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించిన వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ కూడా మరిన్ని డిఫెరెంట్ కథలతో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా అతనికి సంబంధించిన స్టైలిష్ ఫొటోస్ వైరల్ గా మారాయి.
మొదటి సినిమాతోనే న్యూ రికార్డ్
వైష్ణవ్ తేజ్ ఉప్పెన బాక్సాఫీస్ వద్ద దాదాపు 90కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక 50కోట్లకు పైగా షేర్ దక్కించుకుంది. మొదటి సినిమాతోనే అత్యధిక ప్రాఫిట్స్ అందించిన హీరోగా వైష్ణవ్ తేజ్ న్యూ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక హీరోయిన్ కృతి శెట్టికి కూడా మంచి గుర్తింపు దక్కింది. డైరెక్టర్ బుచ్చిబాబు కూడా అప్పుడే స్టార్ దర్శకుల లిస్టులో చేరిపోతున్నాడు.
న్యూ స్టైలిష్ లుక్
ఇక వైష్ణవ్ తేజ్ ఓ వర్గం ఆడియెన్స్ ను బాగానే ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో అతని ఫోటలకు రెస్పాన్స్ గట్టిగానే వస్తోంది. ఇక ఇటీవల పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు కూడా ట్రెండ్ లిస్ట్ లోకి వచ్చేశాయి. చాలా స్టైలిష్ గా కనిపిస్తున్న ఈ హీరో భవిష్యత్తులో మరిన్ని డిఫరెంట్ లుక్స్ తో సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఒక సినిమాతో రెడీగా..
ఇక ఉప్పెన అనంతరం క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంది. జంగిల్ బుక్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక దర్శకుడు క్రిష్ పవన్ సినిమాతో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాను వాయిదా వేశాడు.
మరో సినిమాను మొదలుపెట్టిన వైష్ణవ్
ఇక గిరిశయ్య దర్శకత్వంలో కూడా వైష్ణవ్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ దర్శకుడు తమిళ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ ను డైరెక్ట్ చేసి మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక సరికొత్త కథతో ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ను డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇటీవల సినిమాను అఫీషియల్ గా లాంచ్ కూడా చేశారు. మరి ఈ కొత్త సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.