Don't Miss!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
22ఏళ్ళ పాప్ సింగర్ హత్య:ఆటోగ్రాఫ్ ఇస్తూండగానే కాల్చేసాడు
అమెరికాలోని ఓర్లాండోలో పాప్ సింగర్ క్రిస్టినా గ్రిమ్మీ(22) దారుణ హత్యకు గురైంది. యూట్యూబ్ స్టార్ గా, అమెరికన్ పాప్ సింగర్ గా పేరుపొందిన ఆమెపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. టీవీ షో 'బి ఫోర్ యు ఎగ్జిట్' ప్రదర్శన ముగిశాక ఆమెను అభిమానులు చుట్టుముట్టారు. ఆమె అభిమానులతో ముచ్చటిస్తూ వారికి ఆటోగ్రాఫ్ ఇస్తోన్న సమయంలో ఓ దుండగుడు ఆమెపై కాల్పులు జరిపి, అనంతరం తనని తాను కాల్చుకొని చనిపోయాడు.
దాడిలో గాయపడ్డ గాయని క్రిస్టీనా మృతిచెందినట్లు ఒర్లాండో పోలీసులు ట్విట్టర్లో పేర్కొన్నారు. గాయని సోదరుడు సాయుధున్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కొంత సేపు వాళ్ల మధ్య పెనుగులాట జరిగింది. ఆ తర్వాత సాయుధుడు తనను తాను కాల్చుకున్నాడు. గన్తో దాడి చేసింది ఎవరన్నది ఇంకా పోలీసులు గుర్తుపట్టలేదు. ఆ వ్యక్తి ఎందు కోసం కాల్పులకు దిగాడో కూడా ఇంకా తెలియరాలేదు.
ద వాయిస్ పాటల పోటీల సిరీస్లో సింగర్ క్రిస్టీనా ఒకసారి మూడవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆమెకు యూట్యూబ్లో అభిమానులు విపరీతంగా పెరిగారు. ఆమె వీడియోలకు లక్షల సంఖ్యలో హిట్లు కూడా వచ్చాయి. చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న క్రిస్టినా..ఇంత ధారుణం గా మరణించతం అంతర్జాతీయ సంగీతాభిమానులను విచారనికి గురిచేస్తోంది...