Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఈ వారం ఆ ఒక్కటే రిలీజ్
ఈ వారం ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీ రావు నిర్మించిన టీనేజ్ ఎంటర్ టైనర్ 'నిన్ను కలిశాక'ఒక్కటే రిలీజ్ అవుతోంది. సీనియర్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు డైర్ట్ చేసిన ఈ చిత్రం ద్వారా సంతోష్, చైతన్య, ప్రియ, డిపాషా హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. అలాగే ఈ చిత్రంలో 'ప్రేమ్ బాబా' అనే స్పెషల్ రోల్ ను శివనాగేశ్వరరావు పోషించడం విశేషం. ఉషాకిరణ్ బ్యానర్ పై రూపొందిన 83వ చిత్రమిది. 'నచ్చావులే' వంటి సక్సెస్ తర్వాత ఈ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో బయిట మంచి అంచనాలున్నాయి. అలాగే ఈ శుక్రవారం కృష్ణవంశి,శ్రీకాంత్ కాంబినేషన్ లో రెడీ అయిన 'మహాత్మ' చిత్రం కూడా రిలీజ్ కావలసి ఉంది. అయితే ఈ చిత్రం సెన్సార్ కు వెళ్లి ప్రస్తుతం రివైజింగ్ కమిటీ ముందు ఉంది. దీంతో విడుదల తేదీని ఈ నెల 9వ తేదీకి నిర్మాత వాయిదా వేశారు. దీంతో ఈ శుక్రవారం ఉషాకిరణ్ మూవీస్ 'నిన్ను కలిశాక' ఒక్కటే రంగంలో ఉంది.