Don't Miss!
- News వైఎస్ షర్మిలకు షాక్.. వియ్యంకురాలుపై ఐటీ దాడులు
- Sports ఐపీఎల్ లైవ్ ఫ్రీ.. ఒక్క RCB ఫ్యాన్స్కు తప్ప!
- Technology ఆపిల్ నుంచి త్వరలో ఏయే ఉత్పత్తులు లాంచ్ కానున్నాయో తెలుసా.. ఫోల్డబుల్ ఐఫోన్లు, ఐప్యాడ్లు సహా..!!
- Lifestyle ఈ మూడింటిలో మీ వేలు ఆకారం ఎలా ఉందో చెప్పండి... మీరు ఎలాంటి వారో మేం చెబుతాం
- Finance Gold Rate: షాకింగ్.. షాకింగ్.. షాకింగ్.. ఏకంగా రూ.4,600 పెరిగిన గోల్డ్.. ఒక్కరోజులోనే..
- Automobiles కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
అయ్యో..... ‘ఉత్తమ విలన్’కు కత్తెర
హైదరాబాద్: కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్' చిత్రం రిలీజ్ అవ్వడమే వివాదాలతో రిలీజైంది. మే 1న విడుదల కావాల్సిన సినిమా ఆర్థిక సమస్యలతో మే 2 మద్యాహ్నం వరకు విడుదల కాలేదు. తీరా విడుదలైన తర్వాత సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా రన్ టైంలో 20 నిమిషాలు కోత పెట్టాలని నిర్ణయించారు.
సినిమా కథ బావుందని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. మరో వైపు కమల్ హాసన్, ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. అయితే స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేక పోవడం సినిమాకు మైనస్ అయింది. చాలా మంది ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారు. ఇది గమనించిన నిర్మాతలు సినిమా నిడివి 20 నిమిషాలు తగ్గించాలని నిర్ణయించారు.
ఉత్తమ విలన్ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. పూజాకుమార్, ఆండ్రియా, పార్వతీ మేనన్ హీరోయిన్లు. ఈ చిత్రాన్ని తెలుగులో సి.కళ్యాణ్ విడుదల చేసారు. కమల్హాసన్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఎన్.లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్, కమల్హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. గిబ్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.