twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగచైతన్య 'గౌరవం'ని యూటీవీ నిలబెట్టింది

    By Srikanya
    |

    రాధా మోహన్ దర్సకత్వంలో రూపొందాల్సిన నాగచైతన్య గౌవరం చిత్రం ఆగిపోయిందంటూ ఆ మధ్యన వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా ప్రాజెక్టుని యు.టీవి వాళ్లు భుజాన వేసుకుని నిలబెట్టారు. గతంలో మహేష్ బాబుతో అతిధి చిత్రం చేసిన యూటీవీ మోషన్ పిక్చర్స్ వారు లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో నాగచైతన్య సినిమాతో రంగంలోకి దిగుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ జాయింట్ వెంచర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

    జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. రాధామోహన్ గతంలో చేసిన 'ఆకాశమంత', 'గగనం' చిత్రాలు తెలుగులో మంచి విజయాన్నే సాధించాయి. ఇక ప్రస్తుతం నాగచైతన్య ...ప్రస్దానం దర్శకుడు దేవకట్టాతో ఆటోనగర్ సూర్య చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం ఎనభైల్లోనూ,తొంభైల్లోనూ విజయవాడలో జరిగిన కాస్ట్ పాలిటిక్స్, యూనియన్ ఇష్యూల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. నాగచైతన్య ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక గౌరవం చిత్రం రూరల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఎంటర్టైన్మెంట్ చిత్రం. కథ చాలా డిఫెరెంట్ గా ఉండబోతోందని తెలుస్తోంది. నాగార్జున కూడా ఈ చిత్రంలో నటించనున్నారు.

    English summary
    UTV Motion Pictures and Annapurna Studios would jointly produce Naga Chaitanya's next film titled Gauravam .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X