Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
‘ఉయ్యాలా జంపాలా’ రిలీజ్ డేట్ ప్రకటించిన నాగ్
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత డి.సురేష్బాబు సమర్పణలో సన్షైన్ సినిమాస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై విరించివర్మ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'ఉయ్యాలా జంపాలా'. నాగార్జున, హిట్ చిత్రాల నిర్మాత రామ్మోహన్ పి. నిర్మిస్తున్న ఈ విభిన్న కథా చిత్రం బావా మరదళ్ల ప్రేమ కథగా చెప్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలాగే ఈ సినిమా ఆడియోని ఈ నెల 15న గ్రాండ్ గా హైదరాబాద్ శిల్ప కళా వేదికలో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని నాగార్జున ధృవీకరించారు.
నిర్మాత నాగార్జున అక్కినేని మాట్లాడతూ..'మా' టి.వి.లో ప్రసారమవుతున్న చిన్నారి పెళ్ళికూతురు అంటే మీకు బాగా ఇష్టం. ఆ ఆనందియే మా 'ఉయ్యాల జంపాల'లో ఉమాదేవి. రాజ్ తరుణ్, ఆనందిలను హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఇందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేమందరం కలిసి మీకు అందిస్తున్న ఒక స్వచ్ఛమైన, అచ్చమైన తెలుగింటి ప్రేమకథ 'ఉయ్యాల జంపాల'. ఈ చిత్రం ఆడియోను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం' అని అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన రామ్మోహన్ మాట్లాడుతూ ' ఇంతకుముందు మా బేనర్లో 'అష్టాచెమ్మా', 'గోల్కొండ హైస్కూల్' చిత్రాలు నిర్మించాం. ప్రస్తుతం సురేశ్బాబు, నాగార్జునతో కలిసి తీస్తున్న విభిన్న కథాచిత్రం 'ఉయ్యాలజంపాల'. ఈ కథ నాగార్జునగారికి నచ్చడంతో సురేశ్బాబుతో కలిసి ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాం. రాజ్తరుణ్ అనే కొత్త నటుడు హీరోగా నటించిన ఈ సినిమాతో 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్తో ఎంతో పేరు తెచ్చుకున్న ఆనందిని హీరోయిన్గా పరిచయం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ నెల్లోనే ఆడియోను విడుదల చేస్తాం' అని తెలిపారు.
ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: విశ్వ డి.బి., ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, కల: ఎస్.రవీందర్, సంగీతం: సన్నీ ఎం.ఆర్. నిర్మాతలు: నాగార్జున అక్కినేని, రామ్మోహన్ పి., దర్శకత్వం: విరించి వర్మ.