Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
V movie వివాదం: అక్రమంగా సినీ నటి ఫోటో వాడకం.. అమెజాన్ ప్రైమ్కు హైకోర్టు షాక్
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోకు బాంబే హైకోర్టు షాకిచ్చింది. వీ సినిమాలో నటించిన సాక్షి మాలిక్ ఫోటోను నిబంధనలకు విరుద్ధంగా వాడటంపై తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. వెంటనే తొలగించాలని ఆదేశాలిచ్చింది. ఈ వివాదంలో ఏం జరిగిందంటే..
Recommended Video
లాక్డౌన్లో నేరుగా అమెజాన్లో
లాక్డౌన్
కాలంలో
నేచురల్
స్టార్
నాని
నటించిన
వీ
సినిమా
నేరుగా
అమెజాన్
ప్రైమ్
వీడియోలో
రిలీజైంది.
ఆ
చిత్రం
సినీ
ప్రేక్షకులను
అంతగా
మెప్పించలేకపోయింది.
డివైడ్
టాక్తో
సినిమా
ఓటీటీలో
ముందుకెళ్లింది.
వీ
చిత్రంలో
నాని,
సుధీర్
బాబు
ఫెర్ఫార్మెన్స్
అభిమానులకు
కాస్త
ఊరటను
ఇచ్చింది.
సెక్స్ వర్కర్గా సాక్షి మాలిక్
వీ చిత్రంలో అదితిరావుతోపాటు సాక్షి మాలిక్ ఓ కీలక పాత్రలో కనిపించింది. కమర్షియల్ సెక్స్ వర్కర్గా సాక్షి మాలిక్ నటించింది. అయితే వీ సినిమాను అమెజాన్లో లోడ్ చేసినప్పుడు సాక్షి ఫోటోను ఉపయోగించారు. అయితే ఆమె ఫోటోను అనుమతి లేకుండా వాడటం వివాదంగా మారింది.
బాంబే హైకోర్టులో పిటిషన్
సాక్షి మాలిక్ ఫోటోను 2017లో ముంబైకి చెందిన ఓ ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించారు. ఆ తర్వాత సాక్షి తన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. అయితే ఆ ఫోటోను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తన ఫ్లాట్ఫామ్పై ఉపయోగించింది. అయితే తన ఫోటోను అనుమతి లేకుండా ఫోటోను వాడారంటూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అమెజాన్కు బాంబే హైకోర్టు షాక్
సాక్షి మాలిక్ తరఫున వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్ ఫోటోను అమెజాన్ ప్రైమ్ వీడియో ఉపయోగించుకోవడం వ్యక్తిగత ప్రైవసీకి భంగం వాటిల్లేలా చేయడమే అని అన్నారు. దాంతో 24 గంటల్లో సాక్షి మాలిక్ ఫోటోను తొలగించాలని అమెజాన్కు బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది.