Don't Miss!
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎక్కడ లేని నీరసం ఆవహించింది.. వి వి వినాయిక్
ఒళ్లు హూనమైపోయింది. తీరా చూస్తే ఆ ప్రదేశం షూటింగ్కి ఏ మాత్రం అనువుగా లేదు. ఎక్కడ లేని నీరసం ఆవహించింది. ఆ ప్రాంతంలో కరెంట్ లేదు. కనీసం తినడానికి కూడా ఏమీ లేదు అంటూ 'బద్రినాథ్'షూటింగ్ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు దర్శకుడు వి వి వినాయిక్. ఈ నెల పదవ తేదీన విడుదల అవుతున్న 'బద్రినాథ్'చిత్రం ప్రమేషన్ లో భాగంగా కలిసిన మీడియాతో చర్చిస్తూ ఇలా స్పందించారు.ఇంతకీ వి వి వినాయిక్ ని అంతగా ఒళ్ళు హూనం చేసి నీరసం తెప్పించిన ప్లేసు ఏమిటంటే..కీ మోనస్ట్రీ అనే బౌద్ధారామం.దాని గురించి మాట్లాడుతూ..కీ మోనస్ట్రీ అనే బౌద్ధారామాన్ని ఓ రోజు నెట్లో చూశాం. అది సముద్ర మట్టానికి 14వేల అడుగుల ఎత్తున ఉంది.
కులుమనాలికి దాదాపు 200 కి.మీ. దూరం. చాలా అద్భుతంగా కనిపించింది. ఎలాగైనా సరే అక్కడ కొన్ని సన్నివేశాలు తీయాలి అనిపించింది. అయితే లోయలు కాబట్టి ప్రయాణం చేయడం చాలా కష్టమైంది. కులు నుంచి దాదాపు 12 గంటలు పట్టింది. అక్కడికి వెళ్లేసరికి రాత్రి ఏడు గంటలైంది.చిన్న హోటల్ ఉంది. వెళ్లి ఏమైనా ఉందాని అడిగితే లేదన్నారు. ఎక్కడో చిన్న పండ్ల దుకాణం కనిపించింది. వెళ్లి చూస్తే అడుగుబొడుగు పళ్లున్నాయి. వాటినే తిని కడుపు నింపుకొన్నాం. దేవుడా ఈ రాత్రి గడిస్తే చాలు... అనిపించింది. ఇలాంటి అనుభవాలు షూటింగ్ సమయంలో చాలానే ఎదురయ్యాయి అన్నారు.