Don't Miss!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
'కాస్కో' విజయోత్సాహం
ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ కథానాయకుడుగా 'కొత్త బంగారు లోకం" ద్వారా పరిచయమైన శ్వేతా బసుప్రసాద్, గౌరి పండిట్లు హీరోయిన్లుగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కె.ఫిలిమ్స్ పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి నిర్మించిన 'కాస్కో" చిత్రం ఇటీవలె విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా ఫిలించాంబర్లో విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ''సినిమా చూసిన వారంతా చాలా బాగుంది. వైభవ్ బాగా చేసాడు అంటున్నారు. ప్రేక్షకులకు నా ధన్యవాదాలు"" అన్నారు. వైభవ్ మాట్లాడుతూ ''సినిమాలో పాటలు, ఫైట్లు చాలా బాగున్నాయని అంతా అంటున్నారు. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు"" అన్నారు. దర్శకుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ''విజయవంతంగా మూడో వారం ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో అన్ని అంశాలు చక్కగా కుదిరాయి. ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు"" అన్నారు.