Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'కాస్కో' విజయోత్సాహం
ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ కథానాయకుడుగా 'కొత్త బంగారు లోకం" ద్వారా పరిచయమైన శ్వేతా బసుప్రసాద్, గౌరి పండిట్లు హీరోయిన్లుగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కె.ఫిలిమ్స్ పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి నిర్మించిన 'కాస్కో" చిత్రం ఇటీవలె విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా ఫిలించాంబర్లో విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ''సినిమా చూసిన వారంతా చాలా బాగుంది. వైభవ్ బాగా చేసాడు అంటున్నారు. ప్రేక్షకులకు నా ధన్యవాదాలు"" అన్నారు. వైభవ్ మాట్లాడుతూ ''సినిమాలో పాటలు, ఫైట్లు చాలా బాగున్నాయని అంతా అంటున్నారు. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు"" అన్నారు. దర్శకుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ''విజయవంతంగా మూడో వారం ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో అన్ని అంశాలు చక్కగా కుదిరాయి. ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు"" అన్నారు.