Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'కాస్కో' విజయోత్సాహం
ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ కథానాయకుడుగా 'కొత్త బంగారు లోకం" ద్వారా పరిచయమైన శ్వేతా బసుప్రసాద్, గౌరి పండిట్లు హీరోయిన్లుగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కె.ఫిలిమ్స్ పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి నిర్మించిన 'కాస్కో" చిత్రం ఇటీవలె విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా ఫిలించాంబర్లో విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ''సినిమా చూసిన వారంతా చాలా బాగుంది. వైభవ్ బాగా చేసాడు అంటున్నారు. ప్రేక్షకులకు నా ధన్యవాదాలు"" అన్నారు. వైభవ్ మాట్లాడుతూ ''సినిమాలో పాటలు, ఫైట్లు చాలా బాగున్నాయని అంతా అంటున్నారు. ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు"" అన్నారు. దర్శకుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ''విజయవంతంగా మూడో వారం ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో అన్ని అంశాలు చక్కగా కుదిరాయి. ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు"" అన్నారు.