Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సాయిధరమ్ తేజ్ తమ్ముడి ఎంట్రీకి ముహూర్తం ఖరారు!
మెగా ఫ్యామిలీ నుంచి మరో నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడైన వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు వైష్ణవ్ తొలి చిత్రానికి ముహూర్తం కుదిరింది. దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీస్ సంస్థ సంయుక్తంగా నిర్మించబోతున్న చిత్రం జనవరి 21న అంటే రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతోంది.
సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు అనే వ్యక్తి ఈ చిత్రానికి దర్శత్వం వహించబోతున్నాడట. ఇక వైష్ణవ్ డెబ్యూ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండడం విశేషం. విశ్వరూపం 2 చిత్రానికి పనిచేసిన శ్యామ్ దత్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించనున్నారు. రంగస్థలం చిత్రానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్స్ దంపతులు రామకృష్ణ, మౌనిక ఈ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు.
వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ లాంచింగ్ కు ముఖ్య అతిధిగా ఎవరొస్తారనే విషయంలో క్లారిటీ రాలేదు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. సాయిధరమ్ తేజ్ ఇప్పటికే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వైష్ణవ్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.