Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవినే ఎవరు మీరు అని ప్రశ్నించా.. ఆయన మాటలతో రోమాలు నిక్కబొడిచాయ్’
సూపర్స్టార్ మహేష్ బాబు కెరీర్లో మైలురాయి చిత్రంగా తెరకెక్కిన మహర్షి చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తున్నది. హృదయానికి టచ్ చేసే కథతో రూపొందిందనే ఫీడ్ బ్యాక్ అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి వచ్చింది. అయితే కథనం కాస్త నెమ్మదించిందనే ఫిర్యాదు కూడా వినిపించింది. ఇలాంటి రియాక్షన్ల మధ్య వసూళ్లు భారీగానే నమోదయ్యాయి. ఈ క్రమంలో తమ సినిమా సాధిస్తున్న కలెక్షన్ల గురించి నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి మీడియాతో మాట్లాడారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ..
హార్ట్ను టచ్ చేసే మూవీ
మహర్షి సినిమా మైండ్తో ఆలోచించే సినిమా కాదు. మనసు, హృదయానికి టచ్ చేసే సినిమా. ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ స్లోగా ఉందని, నిడివి ఎక్కువైందనే వాదన వినిపించింది. ఫస్టాఫ్, సెకండాఫ్కు కనెక్ట్ ఉండదు. కథలో చాలా వేరియేషన్ ఉంటుంది. మెజారిటీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. డిస్టిబ్యూటర్లు చాలా మంది ఫోన్ చేసి హ్యాపీగా ఉన్నామని చెబుతున్నారు. ప్రేక్షకులు కూడా మంచి కథతో సినిమాను అందించారని ప్రశంసిస్తున్నారు.
చిరంజీవిని ఎవరు మీరు అని అడిగా
ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. నాకు వచ్చిన ఫోన్ కాల్స్లో మెగాస్టార్ చిరంజీవి నాకు స్పెషల్. ఉదయం నాకు ఓ నంబర్తో ఫోన్ కాల్ వచ్చింది. ఎవరిదో అని నేను ఫోన్ ఎత్తాను. వంశీ అని అటువైపు నుంచి మాట వినిపించగానే.. మీరు ఎవరు అని అడిగాను. దాంతో నేను చిరంజీవి అంటూ సమాధానం వచ్చింది.
చిరంజీవి ప్రశంసలతో రోమాలు
చిరంజీవి నుంచి ఫోన్ రావడం, ఆయన మాటలు వింటుంటే రోమాలు నిక్కబొడిచాయి. సినిమా గురించి ఆయన చెప్పిన ప్రతీ విషయం విని నాకు చాలా సంతోషం కలిగింది. నా బాల్యంలో మే 9న తేదీన జగదేక వీరుడు అతిలోక సుందరి చూసి సినిమాపై పిచ్చి ఏర్పడింది. అదే మే 9న నేను దర్శకత్వం వహించిన మహర్షి సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది.
5 నిమిషాలపాటు సినిమా గురించి
అలాంటి ఫీలింగ్స్తో ఉన్నప్పుడు.. చిరంజీవి గారు 5 నిమిషాలపాటు నాతో మాట్లాడటం జీవితంలో మరిచిపోలేని అనుభూతి. ఎందుకంటే ఆయనను చూస్తూ పెరిగాం. ఆరాధించాం. చిరంజీవి గానే నాకు ఫోన్ చేసి ఇది నా మొబైల్ నంబర్. దానిని ఫీడ్ చేసుకోమని చెప్పారు అని వంశీ పైడిపల్లి అన్నారు.
ఆది సినిమా చూసి ఉద్యోగం వదిలేసాను
మహర్షి తర్వాత నాకు వచ్చిన మరో కాల్ దర్శకుడు వీవీ వినాయక్ గారిది. ఆయన తీసిన ఆది సినిమా చూసి నేను సినిమాల్లోకి రావాలనుకొన్నాను. ఆది చూసిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వచ్చాను. అలాంటి వ్యక్తి నాకు ఫోన్ చేసి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రాలో అన్ని ప్రదేశాల్లో థియేటర్లు హౌస్ఫుల్ అయ్యాయని చెప్పారు. డిస్టిబ్యూటర్లు వారాంతానికి లాభాల్లోకి వస్తాయని వినాయక్ చెప్పారని వంశీ పైడిపల్లి అన్నారు.