Don't Miss!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆస్ట్రేలియా కథతో మహేష్కు ఎలాంటి సంబంధం లేదు..అంతా ట్రాష్!
సూపర్ స్టార్ మహేష్ ఫాన్స్ కు 2018 పండగే అని చెప్పొచ్చు. వరుస చిత్రాలతో మహేష్ ఈ ఏడాది బిజీకాబోతున్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కోటికి పైగా వ్యూస్ తో భరత్ అనే నేను టీజర్ దూసుకుపోతోంది. ఈ చిత్రం తరువాత మహేష్ బాబు వంశీ పైడి పల్లి దర్శకత్వంలో సినిమా ప్రారంభించబోతున్నాడు. ఈ చిత్రం గురించి ఇటీవల కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని దర్శకుడు వంశి పైడి పల్లి తేల్చేశాడు.
జోరుమీదున్న సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీమంతుడు వంటి ఘన విజయాన్ని మహేష్ కు అందించిన కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.భరత్ అనే నేను చిత్రంపై సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది.
తొలిసారి ముఖ్యమంత్రిగా
మహేష్ బాబు ఈ చిత్రంలో తొలిసారి ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా అలరించబోతున్నాడు. టీజర్ లో మహేష్ లుక్స్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఈ ఏడాది మరో చిత్రం
భరత్ అనే నేను చిత్రం పూర్తి కాగానే మహేష్ మరో చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. చాలా రోజుల క్రితం మహేష్ వంశీ పైడిపల్లికి కమిట్ మెంట్ ఇచ్చాడు. భరత్ అనే నేను చిత్రం తరువాత వంశి పైడిపల్లి దర్శకత్వంలోని చిత్రం మొదలవుతుంది.
ఆస్ట్రేలియా కథ
ఈ చిత్రంపై సోషల్ మీడియాలో కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. వంశి పైడిపల్లి మహేష్ బాబు చిత్రాన్ని ఓ ఆస్ట్రేలియా వెబ్ సిరీస్ ఆధారంగా తెరకెక్కించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. వంశి పైడిపల్లి చివరగా తెరకెక్కించిన చిత్రం ఊపిరి ఓ ఫ్రెంచ్ మూవీ ఆధారంగా రూపొందించింది. ఆ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఊపిరి చిత్రానికి వంశి పైడిపల్లి ప్రశంసలు అందుకున్నారు.
రూమర్స్ కి చెక్
దీనిపై వంశీ పైడిపల్లి తాజగా సోషల్ మీడియాలో స్పదించారు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. మహేష్ 25 వ చిత్రానికి వేరే ఏ కథతో సంబంధం లేదని తేల్చేసాడు.