twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్న నాగార్జునకో బృందావనం...!?

    By Sindhu
    |

    హీరోగా ఎంట్రీ ఇచ్చి 25సంత్సరాలు దాటినా హీరోగా ఇప్పటికీ బిజీగానే వుంటూ యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నాడు నాగార్జున. బాలకృష్ణ, వెంకటేష్ లతో కంపేర్ చేస్తే ఈ మధ్యకాలంలో నాగార్జునే ఎక్కువ సినిమాలు చేశాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, చేయబోతున్న సినిమాలు కూడా ఎక్కువే వున్నాయి. రాజన్న, ఢమురుకం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటూ వుండగా శిరిడీసాయి ప్రారంభం కావాల్సి వుంది. అలాగే ఆది శంకరాచార్య చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు నాగార్జున.

    ఇవి కాకుండా బృందావనం డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో నాగ్ ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిసింది. డి శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. వంశీ ఇప్పటికే రామ్ చరణ్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. 'రచ్చ" తర్వాత రామ్ చరణ్ వంశీ డైరెక్షన్ లో సినిమా చేస్తాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత నాగార్జున, వంశీ కాంబినేషన్ లో మూవీ స్టార్ట్ అవుతుందని సమాచారం.

    English summary
    Vamsi Paidipally, who gave a hit like 'Brindavanam' is getting good opportunities now a days. D Siva Prasada Reddy of Sri Kamakshi Enterprises reportedly asked him to prepare a good script keeping in view Nagarjuna's image and the director busy narrating storyline to impress Nagarjuna and the story discussions are in progress.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X