Don't Miss!
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్న నాగార్జునకో బృందావనం...!?
హీరోగా ఎంట్రీ ఇచ్చి 25సంత్సరాలు దాటినా హీరోగా ఇప్పటికీ బిజీగానే వుంటూ యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నాడు నాగార్జున. బాలకృష్ణ, వెంకటేష్ లతో కంపేర్ చేస్తే ఈ మధ్యకాలంలో నాగార్జునే ఎక్కువ సినిమాలు చేశాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, చేయబోతున్న సినిమాలు కూడా ఎక్కువే వున్నాయి. రాజన్న, ఢమురుకం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటూ వుండగా శిరిడీసాయి ప్రారంభం కావాల్సి వుంది. అలాగే ఆది శంకరాచార్య చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు నాగార్జున.
ఇవి కాకుండా బృందావనం డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో నాగ్ ఓ సినిమా చేయబోతున్నట్టు తెలిసింది. డి శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. వంశీ ఇప్పటికే రామ్ చరణ్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. 'రచ్చ" తర్వాత రామ్ చరణ్ వంశీ డైరెక్షన్ లో సినిమా చేస్తాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత నాగార్జున, వంశీ కాంబినేషన్ లో మూవీ స్టార్ట్ అవుతుందని సమాచారం.