Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ బాబు కోసం అమెరికా మొత్తం వెతుకుతున్నారు
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఏడాదికి పైగా ఎంతో కష్టపడి తీసిన స్పైడర్ సినిమా భారి డిజాస్టర్ అయ్యింది.
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఏడాదికి పైగా ఎంతో కష్టపడి తీసిన స్పైడర్ సినిమా భారి డిజాస్టర్ అయ్యింది. ఇంతకుముందు బ్రహ్మోత్సవం సినిమాతో అపజయాన్ని అందుకున్న మహేష్ స్పైడర్ తో మళ్లీ ట్రాక్ లోకి వద్దామని చాలా కష్టపడ్డాడు. సినిమా విడుదల వరకు నమ్మకంతోనే ఉన్న మహేష్ ప్రేక్షకులు నిరాశ చెందడంతో తాను కూడా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు.
భరత్ అను నేను
మహేష్ బాబు ఇంకా తన మనసులో స్పైడర్ ఇచ్చిన రిజల్ట్ గురించి కొంచెం బాధలో ఉన్నాడని టాక్ వినిపించింది. అయితే మళ్ళీ వెంటనే కోలుకొని "భరత్ అను నేను" షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇది కాస్త పక్కన పెడితే మహేష్ కంటే ఎక్కువ తన తర్వాతి సినిమా గురించి ఆలో చిస్తున్నది టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి.
వైజయంతీ మూవీస్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మరియు వైజయంతీ మూవీస్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, దిల్రాజు నిర్మాతలుగా ఓ భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటి వరకు ఖరారు కాలేదు.
న్యూయార్క్ వీధులను చుట్టేస్తున్నాడు
ఇప్పుడీ దర్శకుడు మహేష్ 25వ సినిమా లొకేషన్స్ కోసం అమెరికా లోని న్యూయార్క్ వీధులను చుట్టేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వంశీ ప్రతి షాట్ చాలా రిచ్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకే అమెరికాలో కొన్ని లొకేషన్స్ చూడటానికి తన ఫెవరెట్ సినిమాటోగ్రాఫర్ పీఎస్.వినోద్ తో అలాగే ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు తో వెళ్లాడు.
లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నాడు
రీసెంట్ గా న్యూయార్క్ లో దిగిన ఒక ఫొటోను వంశీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నట్లు చెప్పాడు.మహేష్ ప్రస్తుతం కొరటాల శివతో భరత్ అనే నేను సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అయిపోగానే వంశీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నాడు మహేష్. దిల్ రాజు- సి. అశ్విని దత్ ఆ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.