Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాత్ టబ్ పిక్తో రచ్చ.. లైవ్కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
వనిత విజయ్ కుమార్ సోషల్ మీడియాలో ఎంతటి వివాదాలకు తెరలేపుతుందో అందరికీ తెలిసిందే. 2020 మొత్తంలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా మారింది వనిత. మూడో పెళ్లితో వనిత ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. పీటర్ పాల్తో విహహాం, తరువాత విడిపోవడం, ఇలా రచ్చ రచ్చగా మారింది. మొత్తానికి వనిత విజయ్ కుమార్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది. అయితే వనిత ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తెలుగు హీరోలపై..
మూడో పెళ్లి, దానిపై వచ్చిన వివాదాలు, జరిగిన గొడవలు, మీడియాకు ఎక్కడం, పోలీస్ స్టేషన్ వరకు వ్యవహారం వెళ్లడం అందరికీ తెలిసిందే. అలా చివరకు వనిత పీటర్ పాల్ను ఇంట్లోంచి గెంటేయడం, వివాహా బంధానికి ముగింపు పలకడంతో వివాదాలకు దూరంగా అయింది. అయితే ఇప్పుడు తెలుగు హీరోల గురించి చెబుతు వార్తల్లో నిలుస్తోంది.
బన్నీపై అలా..
రెండు మూడు వారాల క్రితం వనిత విజయ్ కుమార్ ఓ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తెలుగు హీరోల గురించి చెబుతూ సంచలన కామెంట్స్ చేసింది. అల్లు అర్జున్ చిన్నతనంలోనే తనకు లైన్ వేశాడంటూ మెగా ఫ్యామిలీతో తమకు మంచి సంబంధాలున్నాయని వనిత చెప్పిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.
అందరూ అక్కడికే..
ప్రస్తుతం స్టార్ సెలెబ్రిటీలు అందరూ కూడా తమ వెకేషన్ను ఎంజాయ్ చేసేందుకు మాల్దీవులకు వెళ్తున్నారు. బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అందరూ కూడా మాల్దీవులకు వెళ్తున్నారు. కొత్త జంటలు హనీమూన్ కోసం, ఫ్యామిలీ మెంబర్స్తో వెకేషన్స్ కోసం అందరూ కూడా మాల్దీవులకు వెళ్లారు.
తాజాగా వనిత..
తాజాగా వనిత విజయ్ కుమార్ కూడా మాల్దీవులకు వెళ్లింది. అక్కడ వనిత చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. బాత్ టబ్ పిక్ను కూడా షేర్ చేసింది. కానీ అందులో మాత్రం ఖాళీగా ఉంది. బాత్ టబ్, బీచ్ వ్యూను చూపించేందుకు మాత్రమే అలా షేర్ చేసినట్టు కనిపిస్తోంది.
లైవ్లోకి వస్తానంటూ..
ప్రస్తుతం వనిత తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకోవాలని పరితపిస్తోన్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా యూట్యూబ్లోకి లైవ్కి వస్తాను.. తెలుగులో ప్రశ్నలు అడగండి.. తెలుగులోనే సమాధానాలు ఇస్తానని చెప్పుకొచ్చింది.