Varalaxmi Sarathkumar: ఆ నటుడిని పార్టనర్ అన్న జయమ్మ.. హాట్ టాపిక్గా ట్వీట్
వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సీనియర్ హీరో, నటుడు శరత్ కుమార్ గారాల కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ శరత్ కుమార్. సినీ కెరీర్ ప్రారంభంలో హీరోయిన్గా అంతగా హిట్ కానీ ఈ బొద్దుగుమ్మ నటిగా మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పటికే తెలుగులో రవితేజ నటించి హిట్ కొట్టిన క్రాక్ సినిమాలో జయమ్మగా ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే జయమ్మ సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఓ నటుడిని పార్టనర్ అని సంబోధిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

కెరీర్ ఆరంభంలో..
సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురిగా సినీ రంగంలో కాలు మోపిన వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్గా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. కేరీర్ ఆరంభంలో విశాల్, శింబు వంటి తదితర మీడియం రేంజ్ హీరోలతో కొన్ని సినిమాలు చేసింది వరలక్ష్మీ శరత్ కుమార్.

నటనకు ప్రశంసలు..
కానీ ఆ సినిమాలు అనుకున్నంత పెద్దగా సక్సెస్ కాలేదు. హీరోయిన్గా విజయం సాధించకపోయినప్పటికీ కూడా వరలక్ష్మి మంచి నటనతో ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది. అనంతరం లేడీ విలన్గా కొన్ని సినిమాల్లో ఊహించినంత రేంజ్లో రెస్పాన్స్ అందుకుంది.

విలన్ పాత్రకు మంచి రెస్పాన్స్..
ముఖ్యంగా విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్గా కనిపించిన విధానం అందరిని ఆశ్చర్యపరిచింది. దాదాపు హీరోతో సమానంగా చాలా అద్భుతంగా ఆ పాత్రలో నటించి మెప్పించింది. ఆ సినిమా తర్వాత ఆమె తెలుగు, తమిళంలో చాలా బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది.

ఫుల్ బిజీగా జయమ్మ..
తెలుగులో క్రాక్, నాంది, పక్కా కమర్షియల్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక స్టార్ హీరోయిన్ సమంత ప్రతిష్టాత్మక చిత్రం యశోదలో ఓ కీలక పాత్ర చేయనున్నట్లు సమాచారం. దీంతోపాటు శబరి, వర ఐపీఎస్, హనుమాన్ వంటి తదితర చిత్రాలతో బిజీగా ఉండనుంది.

నెటిజన్ల ట్రోలింగ్..
కంటెంట్ ఉన్న పాత్రలను ఎంపిక చేసుకునే వరలక్ష్మీ ముక్కుసూటి మనిషి. ఎదైనా కుండ బద్దలు కొట్టినట్లుగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు తన మాటలతో విమర్శలు తెచ్చుకుంటుంది. ఇటీవల రాధికను ఆంటీ అని పిలిచి నెటిజన్ల ట్రోలింగ్కు గురైంది.

పార్టనర్ అంటూ..
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఆసక్తిరంగా ట్వీట్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక నటుడిని పార్టనర్ అంటూ సంబోధిస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమైనట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్లో కోలీవుడ్ యాక్టర్ ప్రసన్నను పార్టనర్ అంటూ ట్వీట్ చేసింది.

నాగార్జున భాయ్ చిత్రంలో..
ఈ ట్వీట్లో ''హ్యాపీ బర్త్డే పార్టనర్ ప్రసన్న.. హ్యావ్ ఏ బ్లాస్ట్.. కీప్ రాకింగ్'' అని రాసుకొచ్చింది వరలక్ష్మీ శరత్ కుమార్. అంతేకాకుండా ఈ ట్వీట్కు ప్రసన్నతో దిగిన ఫొటోను కూడా యాడ్ చేసింది. కాగా నటుడు ప్రసన్న వెంకటేషన్ తమిళ నటుడు అయినప్పటికీ పలు తెలుగు సినిమాల్లో నటించి అలరించాడు. మొదటగా నాగార్జునతో భాయ్ చిత్రంలో నటించాడు.


Click it and Unblock the Notifications











