Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
'గాయం' సీక్వెల్ స్టోరీ లైన్...
తాను త్వరలోనే గాయం సీక్వెల్ నటించే అవకాశంఉందని జగపతిబాబు అన్నారు. తన కెరీర్ లో బెస్ట్ గా నిలిచిన గాయం రిలీజై పదిహేను అయిన సందర్భాగా ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ సంవత్సరం చివరకు ఈ గాయం సీక్వెల్ చిత్రం ప్రారంభిస్తామన్నారు. అలాగే దర్శకుడుగా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు కళ్యాణ్ పరిచయం అవుతాడని అన్నారు. ఇక ఈ సీక్వెల్ చిత్ర కథాశం అప్పటి గాయంలో ఉన్న దుర్గ, అతని గ్యాంగ్ పదిహేను సంవత్సరాల తర్వాత ఏం చేస్తున్నారనేదే అని చెప్పుకొచ్చారు.
అంతేగాక రామ్ గోపాల్ వర్మ తనకు శివ చిత్రం ముందు నుంచి పరిచయమంటున్నాడు జగపతిబాబు. తనని చిత్ర పరిశ్రమలోకి వెళ్ళమని ఎంకరేజ్ చేసిన స్నేహితులలో మెదటివాడు వర్మ. అయితే ఆయనతో సినిమా చేయటం గాయం దాకా కుదరలేదు. నా సినిమాలు వరస ప్లాప్ అవుతూంటే నిరాశపడవద్దని ధైర్యం చెప్పిన వ్యక్తి అతను అంటూ వర్మ గురించి చెప్పుకొచ్చాడు. అలాగే పెద్దరికం సమయంలో ప్రివ్యూ చూసి అందులో యాక్షన్ సీక్వెన్స్ చూసి తనతో సినిమా చేయటానికి ముందుకొచ్చారంటూ వివరించాడు. ఇక గాయం అనంతరం వరసగా యాక్షన్ సినిమాలు చేయకపోవటానికి కారణం మావిచిగురు, శుభలగ్నం హిట్టటి ఫ్యామిలీ హీరో అని మద్ర వేయటమేనని అన్నారు.