Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
తెలివిగా మీడియా దృష్టి మరల్చిన రామ్ గోపాల్ వర్మ....
రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ ఇచ్చుకోవడంలో దిట్ట. ఇప్పటికే రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు సంఘటనల నేపథ్యంలో రౌడీలు, దాదాలు వంటి చిత్రాలు తీస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా అలాంటిదే రవితేజతో 'దొంగలముఠా' సినిమాను తీయనున్నట్లు ప్రకటించారు.
కాగా 'రక్త చరిత్ర" సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్షనిస్టు మద్దెల చెరువు సూరితో కొన్నాళ్ళు చర్చలు జరిపాడు. అలాగే ఈ సినిమాకి సూరి ఫైనాన్స్ చేసాడనే వార్తలను మీడియా ప్రచారం చేస్తోంది. దాంతో మీడియా దృష్టిని ఈ టాపిక్ పై నుండి మళ్ళించడానికి రామ్ గోపాల్ వర్మ 'దొంగలముఠా" సినిమాని అనౌన్స్ చేసాడని పరిశీలకులు అంటున్నారు. 'దొంగల ముఠా"ని ఐదు రోజుల్లోనే తీస్తున్నామని, ఎవ్వరూ పారితోషికాలు తీసుకోవడంలేదని, సినిమా పూర్తయ్యి లాభాలు వస్తే పంచుకుంటామని రామూ పేర్కొన్నాడు. ఇప్పుడు మీడియా ఈ సినిమాపైనే దృష్టి సారించడంతో రామూ పాచిక పారినట్టే.