Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తెలివిగా మీడియా దృష్టి మరల్చిన రామ్ గోపాల్ వర్మ....
రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ ఇచ్చుకోవడంలో దిట్ట. ఇప్పటికే రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు సంఘటనల నేపథ్యంలో రౌడీలు, దాదాలు వంటి చిత్రాలు తీస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా అలాంటిదే రవితేజతో 'దొంగలముఠా' సినిమాను తీయనున్నట్లు ప్రకటించారు.
కాగా 'రక్త చరిత్ర" సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్షనిస్టు మద్దెల చెరువు సూరితో కొన్నాళ్ళు చర్చలు జరిపాడు. అలాగే ఈ సినిమాకి సూరి ఫైనాన్స్ చేసాడనే వార్తలను మీడియా ప్రచారం చేస్తోంది. దాంతో మీడియా దృష్టిని ఈ టాపిక్ పై నుండి మళ్ళించడానికి రామ్ గోపాల్ వర్మ 'దొంగలముఠా" సినిమాని అనౌన్స్ చేసాడని పరిశీలకులు అంటున్నారు. 'దొంగల ముఠా"ని ఐదు రోజుల్లోనే తీస్తున్నామని, ఎవ్వరూ పారితోషికాలు తీసుకోవడంలేదని, సినిమా పూర్తయ్యి లాభాలు వస్తే పంచుకుంటామని రామూ పేర్కొన్నాడు. ఇప్పుడు మీడియా ఈ సినిమాపైనే దృష్టి సారించడంతో రామూ పాచిక పారినట్టే.