Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మరో పాట వివాదంతో రామ్ గోపాల్ వర్మ
వివాదాస్పద చిత్రాల దర్శకుడు రాంగోపాల్వర్మ మరో వివాదానికి తెరలేపారు. తన తాజా చిత్రం రణ్ కోసం ముందుగా అనుకున్న 'జనగణమణ' పాట ను తీసేసి వందేమాతరం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. జాతీయగీతాన్ని తీసేసి జాతీయ గేయాన్ని పెట్టుకోవడం ద్వారా మరో వివాదానికి కారణమయ్యాడు. దాంతో వర్మని ఒక వివాదం నుంచి మరో వివాదానికి ఎందుకు వెళ్తున్నారు? అని అడిగితే "నేనేమీ కావాలని వివాదాన్ని సృష్టించడం లేదు. కేవలం వందేమాతరంలోని రెండు పదాల్ని మాత్రమే తీసుకున్నాను. ఇందులో మేం చేసిన తప్పేమీ లేదు. మొత్తం గీతం... దానికున్న నేపథ్యం వినండి" అంటున్నారు. రణ్' సినిమా కథాంశం కూడా కొత్త చర్చలకు తెర తీస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రసార మాధ్యమాల మధ్య నెలకొన్న పోటీ, దాని పరిణామాల నేపథ్యంగా ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్, పరేష్రావల్, మొహినీష్ బెహల్, సుచిత్రా కృష్ణమూర్తి, గుల్ పగన్ నటిస్తున్నారు.