Don't Miss!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
శీలం గురించి నేను చెప్పిన..
శీలం గురించి నేను చెప్పిన డైలాగులకు మంచి స్పందన వచ్చింది. చాలా బాగా చెప్పారంటూ ఎంతో మంది అమ్మాయిలు నా బ్లాగ్కు మెయిల్స్ పంపిస్తున్నారు' అంటున్నాడు అల్లు అర్జున్. గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా డి.వి.వి.దానయ్య నిర్మించిన 'వరుడు' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా చేసిన భానూ మెహ్రాను శనివారం హైదరాబాద్లో మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పై విధంగా స్పందిచారం. అలాగే చిత్రం సక్సెస్ గురించి చెపుతూ..మొదట్లో డివైడ్ టాక్ ఉన్నా క్రమేణా ఫ్యామిలీస్ రావడం ఆనందంగా ఉంది. అలాగే సెకెండాఫ్ లో విలన్ ఆర్య నా పాత్రను డామినేట్ చేశారనే వాదన వినిపిస్తోంది. అది సరైనది కాదు.
విలన్ ఎంత శక్తివంతంగా ఉంటే, హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది అని అల్లు అర్జున్ అన్నారు. ఇక ఈ సినిమా పబ్లిసిటిలో భాగంగా హీరోయిన్ను రివిల్ చేయలేదు. ఎందుకంటే సినిమాలో హీరో కూడా చాలా సేపు ఆమెని చూడడు. కేవలం పెళ్లి పీటలమీదే చూస్తాడు. ప్రేక్షకులు కూడా అప్పుడే చూస్తే బాగుంటుందనే అభిప్రాయంతో హీరోయిన్ విషయం సస్పెన్స్గా ఉంచాం. ఇది సినిమాకు హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ నా సినిమాల్లో హయ్యస్ట్ కలెక్షన్లు ఈ సినిమా వసూలు చేసిందన్నారు. ఇక భానూ మెహ్రా మాట్లాడుతూ- "అమృతసర్లో పుట్టి పెరిగాను. ముంబైలో మాస్ మీడియా చేశాను. అల్లు అర్జున్, గుణశేఖర్ సినిమాతో పరిచయం కావడం నా అదృష్టం' అని తెలిపారు.