Don't Miss!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
గీతా ఆర్ట్స్ లో వరుణ్ సందేశ్, తమన్నా
ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ లో హ్యాపీడేస్ జంట వరుణ్ సందేశ్,తమన్నా నటించనున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. వచ్చే నెలలో చిత్రీకరణ మొదలవుతుంది. ఈ విషయాలను సుకుమారే మీడియాకు స్వయంగా చెప్పారు. ఇక ఈ చిత్రం బావా, మరదలు మద్య జరిగే కథగా తెరకెక్కనుందని సమాచారం. ఇక సుకుమార్ తాజాగా తీసిన ఆర్య-2 చిత్రం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా మెరుగ్గానే ఉందని తెలుస్తోంది. అలాగే వరుణ్ సందేశ్..లెటెస్ట్ చిత్రం కుర్రాడు కూడా ఫ్లాఫ్ టాక్ ని తెచ్చుకుంది. తమిళంలో హిట్టయిన పొల్లాదవాన్ రీమేక్ ఇక్కడ వర్కవుట్ కాలేదు. అంతకుముందే ఇదే బైక్ కాన్సెప్ట్ తో రైడ్ చిత్రం రావటం ఈ చిత్రం దెబ్బతినటానికి మెయిన్ కారణమని తేల్చారు. ఇక తమన్నా తెలుగు కన్నా తమిళంలో బిజీగా ఉంది. ఆమె తాజా చిత్రం భరత్ కాంబినేషన్ లో జయ్ వుయ్ మెట్ రీమేక్ గా రూపొందింది. అయితే నేటివిటీ సమస్యతో ఈ చిత్రం అక్కడ వారిని ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ ముగ్గురూ మంచి కసితో నెక్ట్స్ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి మంచి ప్రొడక్టే వచ్చే అవకాశం ఉంది.