కదిర్, వరుణ్ సందేష్ చిత్రం టైటిల్ ఏంటంటే...
ప్రముఖ దర్శకుడు కదిర్ డైరక్షన్ లో వరుణ్ సందేశ్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసింది. ఆగస్టు 15నుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రానికి 'జై హో' అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని ఓ ప్రేమ కావ్యంగా రూపొందించాలని ఆయన భావిస్తున్నారు. శ్రీమహాగణపతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాత, కెమెరామెన్ అయిన ఎమ్.సుధాకర్ ఈ చిత్ర నిర్మాత. ఎఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చే ఈ చిత్రంలోని నటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇక కదిర్ గతంలో హృదయం, ప్రేమదేశం, ప్రేమికుల రోజు, కాదల్ వైరస్ వంటి చిత్రాలు రూపొందించారు. అలాగే వరుణ్ సందేశ్ హీరోగా తయారైన మరో చరిత్ర చిత్రం రీమేక్ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు నిర్మాతగా రవి యాదవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











