Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
షిర్డీ లో : కాబోయే భార్యతో వరుణ్ సందేశ్ (ఫొటో)
హైదరాబాద్: ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ సందేశ్, వితికలు షిర్డీ సాయిబాబాని దర్శించుకున్నారు. దర్శనం చాలా బాగా జరిగిందని, అందరూ సుఖ శాంతులతో వర్థిల్లాలని కోరుకున్నానని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా సాయి సంస్థాన్ సిబ్బందితో కలిసి తీసుకున్న ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. నిశ్చితార్థానికి ముందు వరుణ్ సందేశ్ అనారోగ్యంతో బాధపడిన విషయం తెలిసిందే.
Had an amazing darshanam at #Shirdi :-) May God Bless everyone with lots of happiness n peace!!
Posted by Varun Sandesh on 9 December 2015
టాలీవుడ్ హీరో వరణ్ సందేశ్, హీరోయిన్ వితికా షేరు ఎంగేజ్మెంట్ సోమవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు. వరుణ్, వితికాలతో దిగిన ఫోటోలను నవీన్ చంద్ర, నిఖితా నారాయణ్ తదితరులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.
‘పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంలో తనకు జోడీగా నటించిన వితికా షేరుతో వరుణ్ సందేశ్ కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత కొంత కాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారం విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్' చిత్రం భారీ విజయం సాధించడంతో వరుణ్ సందేశ్ మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘కొత్త బంగారు లోకం' కూడా హిట్ కావడంతో వరుణ్ కి అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్ చేసిన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద బొల్తా పడటంతో కెరీర్ కాస్త స్లో అయింది. పెళ్లి తర్వాత తనకు కెరీర్ పరంగా కలిస్తుందని వరుణ్ సందేశ్ భావిస్తున్నారట.