twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనవాళ్లకు తోడుగా నిలవాల్సిన సమయం వచ్చింది: వరుణ్ తేజ్

    |

    శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలు తిత్లి తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. తుఫాను కారణంగా చాలా ఆస్తినష్టం జరుగడంతో పాటు ఎంతో మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.

    తిత్లి కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పలువురు ప్రజలు, సినీ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ రూ. 15 లక్షలు, విజయ్ దేవరకొండ రూ. 5 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 5 లక్షలు, సంపూర్ణేష్ బాబు రూ. 50వేలు విరాళం ప్రకటించారు.

    తాజాగా మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ రియాక్ట్ అయ్యారు. మనవాళ్లను ఆదుకోవాల్సిన సమయం వచ్చింది. నా వంతు బాధ్యత పూర్తిచేశాను. ప్రతి ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రావాలి అని ట్విట్టర్ ద్వారా కోరారు.

    Varun Tej donating Rs 5 lakh for AP Relief Fund

    తిత్లి తుఫాన్ బాధితుల కోసం వరుణ్ తేజ్ రూ. 5 లక్షలు సహాయం అందించారు. మెగా ఫ్యామిలీ నుండి తిత్లి కోసం విరాళం అందించిన తొలి నటుడు వరుణ్ తేజ్ కావడం గమనార్హం. ఇతర స్టార్లు కూడా విరాళం ఇవ్వబోతున్నట్లు సమాచారం.

    English summary
    Varun Tej donating Rs 5 lakh for AP Relief Fund to support the victims of cyclone Titli. "It's time we stand up for our people, I've done my part, I request you all to contribute and help us rebuild our homes in Andhra." Varun Tej tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X