Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అప్పుడు రామ్ చరణ్.. ఇప్పుడు వరుణ్ తేజ్.. మెగా ఫ్యామిలీలో కరోనా టెన్షన్
మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు, ఆయన సతీమణి పద్మజ కరోనా బారిన పడ్దారు.. మొత్తానికి వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇక ఆ మధ్య చిరంజీవి తనకు కరోనా సోకిందని, మళ్లీ కరోనా పరీక్షల్లో తప్పు జరగడంతో ఫలితం తేడాగా వచ్చిందని అభిమానులకు ఉపశమనం కలిగించాడు. అయితే తాజాగా రామ్ చరణ్ కరోనా బారిన పడ్డాడని ప్రకటించడం అందరూ షాక్ అయ్యారు.
రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించడంతో అందరూ అందోళన చెందుతున్నారు. ఎందుకంటే రెండ్రోజుల క్రితం రామ్ చరణ్ఆచార్య సెట్లో సందడి చేశాడు. డైరెక్టర్ కొరటాల శివ, సెట్ డిజైనర్లతో కలిసి సందడి చేశాడు. దీంతో ఆచార్య షూటింగ్ యూనిట్ అంతా ఆలోచనలో పడ్డారు. అయితే రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించిన రెండు మూడు గంటలకే మరో మెగా హీరో కరోనా బారిన పడ్డాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు వరుణ్ తేజ్ ఓ ప్రకటన చేశాడు. తనకు కరోనా పాజిటివ్ అని తెలిపాడు. ఈ రోజు ఉదయం నుంచి కొంత నలతగా ఉంది..కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది.. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ.. హోం క్వారంటైన్లో ఉంటున్నాను. త్వరలోనే మళ్లీ వస్తాను.. మీ అందరి ప్రేమకు థ్యాంక్స్ అంటూ వరుణ్ తేజ్ ప్రకటించాడు.