Don't Miss!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- News పొలిటికల్ స్టార్.. తెలంగాణా కాంగ్రెస్ కమాండర్ రేవంత్ రెడ్డి ఈజ్ బ్యాక్!!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
వరుణ్ తేజ్, వెంకీ మల్టీస్టారర్ ప్రారంభం రేపే!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ చిత్రానికి ముహూర్తం కుదిరింది. హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. శనివారం జూన్ 23 న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం విశేషం.
అనిల్ రావిపూడి చిత్రాలలో ఎక్కువగా వినోదానికి ప్రాధాన్యత ఉంటుంది. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ వంటి చిత్రాలతో ఈ దర్శకుడు ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించాడు. వెంకీ, వరుణ్ తో రూపొందించబోయే ఎఫ్2 చిత్రం కూడా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతోంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇటీవల అనిరావిపూడి, దేవిశ్రీ కలసి మ్యూజిక్ సిట్టింగ్స్ జరిపారు. వెంకీ, వరుణ్ తేజ్ లకు జోడీలుగా తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు.