Don't Miss!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో వేద
టాలీవుడ్ స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ చిరకాల విరామం తర్వాత మరో చిత్రం డైరక్ట్ చేయటానికి సిద్దపడుతున్నట్లు సమాచారం.దాదాపు ఫేడవుట్ అయిపోయిన వేదని ప్రధాన పాత్రలో పెట్టి రూపొందించే ఆ చిత్రానికి సతీ సావిత్రి అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.పౌరాణికం బేస్ చేసుకుని నేటి సమకాలీన సమస్యలపై సెటైర్స్ వేస్తూ ఆధునికకాలంలో జరిగే కథగా ఈ స్క్రిప్టుని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ చిత్రం పరుచూరి బ్రదర్స్ ఇధ్దరూ డైరక్ట్ చేయరని పరుచూరి గోపాల కృష్ణ ఒక్కరే డైరక్ట్ చేస్తారని మరో టాక్ వినపడుతోంది.స్క్రిప్టు వర్క్ పూర్తవగానే షూటింగ్ మొదలు కానుంది.ఇక పరుచూరి బ్రదర్స్ కూడా ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ పడిపోయింది.వాళ్ళు రీసెంట్ గా రాసిన చిత్రాలు ఏమీ భాక్సాఫీస్ వద్ద ఆడలేదు.అలాగే ఈ మధ్య వారు చేసిన మెరుపు చిత్రం స్క్ర్రిప్టు దశలోనే ఆగిపోయింది.ఈ మధ్యన వారు స్కిప్టు వర్క్ చేసిన వీర చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.