Don't Miss!
- News 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈ హీరో ఎవరు? ఏమిటా వేషం?
పక్క ఫోటో చూశారా? చూడ్డానికి ఏదో చైనా, జపాన్ సినిమా ఫోటోలా ఉంది కదూ..! కానీ ఇది మన భారతీయ సినిమా అందులోనూ దక్షిణాది సినిమా. అందులో కనిపిస్తోంది ప్రముఖ హీరో విక్రమ్, సలోని. ఈ సినిమాలో విభిన్నమైన గెటప్ లతో కనిపించబోతున్న విక్రమ్ థియేటర్లలో షేక్ చేయబోతున్నాడని అంటున్నారు.
అపరిచితుడు, శివ పుత్రుడు, మల్లన్న, నాన్న తదితర చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో విక్రమ్ తాజాగా నటిస్తున్న తమిళ నిసిమా 'రాజపట్టయ్'. ఈ సినిమాను తెలుగులో 'వీడింతే'(ట్యాగ్ లైన్ 'బై బర్త్') పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన దీక్షాసేథ్ నటిస్తోంది. 'మర్యాద రామన్న' హీరోయిన్ సలోని ఇందులో ఐటం సాంగులో దర్శనం ఇవ్వబోతుండగా... శ్రియ, రీమా సేన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ ద్శకుడు, నటుడు కె. విశ్వనాథ్ ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర పోషించారు.
కమర్సియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు సుసీన్తిరన్ దర్శకత్వం వహిస్తుండగా, పవన్ కళ్యాణ్ పంజా సినిమాకు సంగీతం అందించిన యువన్ శంకర్ రాజ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చారు. డిసెంబర్ 16న తెలుగు, తమిళంలో ఒకేసారి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తన అద్భుతమైన నటనతో తెలుగులోనూ అశేష ఫ్యాన్ ఫాలోయంగ్ ను సంపాదించుకున్న విక్రమ్ మరోసారి తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.