Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ అమ్మాయికి నేను సపోర్ట్ చేస్తాను.. భాను చందర్
కొత్త నటుడు శ్రీకాంత్ హీరోగా, హేమలత (బుజ్జి) నాయికగా వీరభద్ర క్రియేషన్స్ కొత్త చిత్రాన్ని హైదరాబాద్లో బుధవారం ప్రారంభించింది. హేమలతా రెడ్డి నిర్మాత. కె.గోవర్ధన్రావు దర్శకత్వం వహిస్
కొత్త నటుడు శ్రీకాంత్ హీరోగా, హేమలత (బుజ్జి) నాయికగా వీరభద్ర క్రియేషన్స్ కొత్త చిత్రాన్ని హైదరాబాద్లో బుధవారం ప్రారంభించింది. హేమలతా రెడ్డి నిర్మాత. కె.గోవర్ధన్రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ముహూర్తపు సన్నివేశానికి మల్టీ డైమన్షన్స్ వాసు క్లాప్కొట్టారు. మల్కాపురం శివకుమార్, సరోవరం నిర్మాత శ్రీలత కలిసి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్క్రిప్ట్ను అందజేశారు. అయోధ్యకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో
20 నుంచి రెగ్యులర్ షూటింగ్
నిర్మాత మాట్లాడుతూ ``ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. 50-60 రోజులు రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. త్వరలో నే చిత్రాన్నివిడుదల చేస్తాం. వీరభద్ర క్రియేషన్స్ సంస్థలో మేం నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. ఆల్రెడీ ఒక సినిమా పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది`` అని అన్నారు.
కీలకమైన పాత్రలో భానుచందర్
భానుచందర్ మాట్లాడుతూ ``నాకు మంచి రోల్ ఇచ్చారు. నేను అతిథిగా కాకుండా, పూర్తి లెంగ్త్ ఉన్న పాత్ర చేస్తున్నాను. హేమలత చాలా బాగా నిర్మిస్తున్నారు. ఈ అమ్మాయికి నేను సపోర్ట్ చేస్తాను`` అని తెలిపారు.
సుమన్, భానుచందర్ మంచి సపోర్ట్
దర్శకుడు మాట్లాడుతూ ``అమలాపురంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఆంధ్రా, తెలంగాణలో 50-60రోజులు షూటింగ్ చేస్తాం. సుమన్గారు, భానుచందర్గారు మాకు చాలా సహాయం చేస్తున్నారు. మా ప్రాజెక్ట్ తప్పకుండా హిట్ అవుతుంది. నిర్మాతగారు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు`` అని చెప్పారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
ఈ చిత్రంలో భాను చందర్, సుమన్, సన, కాశీ విశ్వనాధ్, రజిత , విద్యుల్లత , నిహాల్, వేణు, మహేష్, ఫణి, రమణ్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత : హేమలత రెడ్డి , స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె గోవర్ధన్ రావు, సంగీతం : రమణ్ రాథోడ్ , ఫోటోగ్రఫీ : ప్రసాద్ ఈదర (శంకర్ కుమార్ ), ఎడిటింగ్ : నాగిరెడ్డి వి , మాటలు : కరణ్ గోపిని , కథ : వీరభద్ర క్రియేషన్స్.