Don't Miss!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రామ్ గోపాల్ వర్మ పాత్రలో సుమన్ శెట్టి
కమిడెయిన్ సుమన్ శెట్టి త్వరలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మని పేరడీ చేస్తూ రూపొందుతున్న పాత్రలో కనిపించనున్నారు.రామ్ భూపాల్ శర్మ పేరుతో ఈ పాత్ర కనపడనుంది.వీరూ కె దర్సకత్వంలో రూపొందే ఈ చిత్రం ఈ నెల 18న విడుదల అవుతోంది.ఈ విషయమై నిర్మాత లక్కరాజు రాధారాజేశ్వరి మాట్లాడుతూ..మద్దల దరువు నూరి జైల్లో వుండి సెల్ఫోన్ ద్వారా మాఫియాను ఎలా నడిపాడు, దానిని బాలు కిరణ్ అనే వ్యక్తి బయటి నుంచి ఎలా ఆర్గనైజ్ చేశాడు అనే కథను సినిమాలో సినిమాగా రాంభూపాల్శర్మ అనే దర్శకుడు ఎలా తెరకెక్కించాడు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీనిని వచ్చేవారంలో సెన్సార్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈనెల 18న విడుదల చేస్తున్నాం. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటు నార్త్ ఇండియాలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఒక చిన్న సినిమా 140 థియేటర్లలో విడుదల చేయడం ఇదే తొలిసారి అంటున్నారు.
రమాశ్రీ క్రియేషన్స్ పతాకంపై స్వాతి వర్మ, సురేష్, మురళీకృష్ణ, భవాని ప్రధాన పాత్రలుగా వీరు.కె దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'కంపెనీ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత లక్కరాజు రాధారాజేశ్వరి మీడియాతో మాట్లాడారు. అలాగే ..ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లోకి రెండు విడతలుగా విడుదల చేశాం. రీ రికార్డింగ్ కూడా పూర్తయింది. రోజూ పేపర్లలో వస్తున్న వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాటిక్గా కథను మలచుకుని అల్లిన కథ ఇది అన్నారు. ఈ చిత్రంలో జీవా, కృష్ణభగవాన్, శకుంతల, సుమన్శెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: వేలు మణి, పాటలు: విశ్వ, కుల శేఖర్, ఎడిటింగ్: నాగిరెడ్డి, కెమెరా: అరుణ్, స్క్రీన్ప్లే, సంగీతం, దర్శకత్వం: వీరు.కె.