Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఆ ఆలోచన విరమించుకున్న నందమూరి కుటుంబ సభ్యులు!
నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలనుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు హరికృష్ణ అంతిమ యాత్ర కోసం ప్రత్యేకమైన వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది.
హరికృష్ణ అంత్యక్రియలు జూబ్లీ హిల్స్ లోని మహా ప్రస్థానంలో జరగనున్నాయి. ఇదిలా ఉండగా హరికృష్ణ అంత్యక్రియల కోసం ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించిన చైతన్య రథాన్ని సిద్ధం చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో వేల కిమీ చైతన్య రథాన్ని స్వయంగా హరికృష్ణ నడిపారు. ఆ వాహనాన్ని హరికృష్ణ అంత్యక్రియలకు ఉపయోగించే ఆలోచనని నందమూరి కుటుంబ సభ్యులు విరమించుకున్నట్లు తెలుస్తోంది.
ఆ వాహనం నందమూరి కుటుంబానికి ఓ జ్ఞాపికలా ఉంచాలని, అందువలనే వేరే వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. చైతన్య రథం ప్రస్తుతం రామకృష్ణ స్టూడియోలో ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో దానిని ఉపయోగిస్తున్నారు.