Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భం: ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి
Recommended Video
మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంపై తెరకెక్కుతున్న బయోపిక్ ప్రారంభోత్సవం గురువారం ఉదయం నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్లో జరిగింది. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలుగువారు గర్వించే వ్యక్తి రామారావు
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు, చరిత్రలో నిలిచిపోయే సందర్భం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పరుగాంచి తెలుగుదనానికి నిండుతనాన్ని తీసుకొచ్చి, తెలుగు తేజాన్ని ప్రపంచం అంతా చాటి చెప్పి, తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చి, తెలుగు పౌరుషాన్ని దేశ రాజకీయ ముఖ చిత్రంలో వెలిగించి, తాను ఒక వెలుగు వెలిగి, ఆ వెలుగు ద్వారా ప్రజలకు అనేక రకాల సందేశాలు, మేలు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంపై సినిమా ప్రారంభం అయిన రోజు, అందుకే ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు అన్నారు.
ఆయనపై అభిమానంతో వచ్చాను
సాధారణంగా రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు ఇలాంటి కార్యక్రమాలకు రారు. ఎన్టీఆర్ మీద నాకున్న వ్యక్తిగత అభిమానం, స్నేహం ఉంది. అందుకే వచ్చాను. ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయాయి. రామారావు అభిమాని కానివారు సినీరంగంలో లేరంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన లవకుశ, పాతాళభైరవి, దేశోద్ధారకుడు చిత్రాలు మార్చి 29నే రిలీజ్ అయ్యాయి. అదేరోజు ప్రారంభమవుతున్న ‘ఎన్టీఆర్' చిత్రం విజయం సాధించాలి అని వెంకయ్య నాయుడు అన్నారు.
రామారావు చరిత్ర ఇప్పటి తరానికి తెలియాలి
సినిమా అనేది ఒక శక్తివంతమైన సాధనం. అది మనుషులను ప్రభావితం చేస్తుంది. రామారావు లాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర నవతరాలకు తెలియాలి. ఓ మహానుబావుడి చరిత్రను రాయడం, సినిమాగా తీయడం చాలా అవసరం. ఈ ప్రయత్నాన్ని బాలకృష్ణ చేపట్టడం అభినందనీయం. తన తండ్రి పాత్రను కుమారుడు పోషించడం దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి దారితీస్తుంది. ‘ఎన్టీఆర్' చిత్ర ప్రారంభం వేడుకలో పాల్గొనడం నా అదృష్టం. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చరిత్ర సృష్టించారు అని వెంకయ్య అన్నారు.
ప్రజల జీవితాలపై తనదైన ముద్ర వేశారు
చాలా మంది మనలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో చూడలేదు. ఆయన ఆయా పాత్రల్లో నటించి ప్రజల జీవితాలపై తనదైన ముద్ర వేశారు. తెలుగు జాతి ఉన్నంత కాలం వారిని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు వాడిని అని విధంగా గర్వించే విధంగా మన వ్యక్తిగతంగా కూడా ప్రవర్తించాలి.