Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పూరీతో సినిమా ఆగిపోయిందా..? వెనకడుగు వేసిన వెంకీ
ఈ టైమ్లో పూరి జగన్నాథ్తో సినిమా చేయడం, అందునా భారీ బడ్జెట్తో ప్రయోగం చేయడం సరికాదని వెంకటేష్ డిసైడ్ అయిపోయాడట.
మంచి మాస్ స్టోరీతో ఒక్క సారి మళ్ళీ మాస్ ఫాలోయిమంగ్ ని పెంచుకుందామనుకున్న వెంకీ పూరి జగన్నాథ్తో సినిమా చేయాలని తన మార్కెట్ రేట్కి మించిన బడ్జెట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు. నిర్మాతలు ముందుకు రాకపోతే తానే నిర్మాతగా మారాలని కూడా అనుకున్నాడు. అయితే సురేష్బాబు అడ్డు చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ ముందుకి కదల్లేదు. ఈలోగా పూరి జగన్నాథ్ వెళ్లి బాలకృష్ణకి ఇంకో కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. ఒకరకంగా ఆ సినిమా తప్పిపోవటం మంచిదే అయ్యిందనుకుంటున్నాడట వెంకటేష్...
రోగ్' డిజాస్టర్గా నిలిచింది
ఎన్నో ఆశలతో మళ్ళీ పాత పూరీని చూపిస్తుందనుకున్న సినిమా ‘రోగ్' డిజాస్టర్గా నిలిచింది. ఎంత డిజాస్టర్ అయినా పూరి సినిమా అంటే మినిమమ్ కలెక్షన్స్ ఉంటాయి. ఈ సినిమాకు కనీసం ప్రేక్షకాదరణ కూడా లేనట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పూరి దాదాపు పది కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకున్నాడట.
అవమానమే.
ఈ సినిమా ఫుల్రన్లో కనీసం పది కోట్ల రూపాయల షేర్ కూడా తెచ్చుకోలేదని వార్తలు వినబడుతున్నాయి. అంటే పూరి తీసుకున్న రెమ్యునరేషన్ కూడా రికవర్ కాదన్నమాట. ఓవర్సీస్లో అయితే మరీ దారణం అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఓ డైరెక్టర్గా పూరికి ఇది అవమానమే.
రోగ్ రిలీజ్ అయిన తర్వాత
వెంకీతో కూడా సినిమా చేస్తానంటూ పూరి చెబుతున్నాడు కానీ రోగ్ రిలీజ్ అయిన తర్వాత వెంకీ ఆలోచన మారిందని అంటున్నారు. గురుతో పాటే రిలీజ్ అయిన రోగ్ దారుణమైన ఓపెనింగ్ తెచ్చుకోవడంతో పాటు డిజాస్టర్ టాక్తో నడుస్తూ వుండడంతో ఈ టైమ్లో పూరి జగన్నాథ్తో సినిమా చేయడం, అందునా భారీ బడ్జెట్తో ప్రయోగం చేయడం సరికాదని వెంకటేష్ డిసైడ్ అయిపోయాడట.
తేజ డైరెక్షన్లో
పూరితో కంటే తేజ డైరెక్షన్లో చేయడం బెటరని అనుకుంటున్నాడట. తేజ తనకోసం ఏదో కథ సిద్ధం చేసాడని తెలిసి అతడిని రమ్మని కబురంపించాడట... బాలయ్య సినిమా హిట్ అయితే అప్పుడు మళ్లీ పూరితో వెంకీ సినిమా తెర మీదకి వస్తుందేమో కానీ ప్రస్తుతానికి అది డ్రాప్ అయిపోయినట్టే.