Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని నేను గొప్పలు చెప్పిన దాసరినారాయణ రావు
అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల ప్రారంభోత్సవంలో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. ఈ చిత్రోత్సవాలకు బాలలే వ్యాఖ్యాతలుగా ఉండటం విశేషం. దాసరి నారాయణరావును ఆహ్వానిస్తే.. తాను దర్శకుడినని, 140 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పొందానని, గొప్ప దర్శకుల్లో తానూ ఒకడినని చెబుతూ తెలుగువారికి అన్యాయం జరుగుతుందని వాపోయారు. హిందీ వారికి ఉన్న ప్రాధాన్యత తెలుగువారికి లేదని మండిపడ్డారు. అందుకే తెలుగువారిపై మరింత దృష్టిసారించాలని కోరారు.
ఆ తర్వాత గీతారెడ్డి మాట్లాడుతూ సోదరసమానులు, దాసరిగారు ఆవేశపూరితంగా మాట్లాడారు. అందరూ కలిసి కృషిచేసి చలనచిత్రోత్సవాలను జరుపుతున్నారు. ప్రభుత్వంలోని ప్రతిశాఖా హైదరాబాద్ కార్పొరేషన్ కృషిని సమర్థించారు. అంబికా సోనీ మాట్లాడుతూ తెలుగువారికి అన్యాయం ఎక్కడా జరగలేదు. 2007లో తెలుగు సినిమా 'అమూల్యం" కు అవార్డు దక్కిందంటూ ఫెస్టివల్ ఛైర్ పర్సన్ నందితాదాస్ను మెచ్చుకున్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఆమెపై పెట్టిన పనిని సఫలం చేశారని అంబికా సోని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జరిగిన నృత్యాలు, మిమిక్రీ, ఇంద్రజాలం అందరి ఆకట్టుకున్నాయి.
ఇంకా విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాడు. ఆయన రాగానే ఒక్కసారిగా అక్కడి వాతావరణం కేరింతలతో మునిగింది. చాలామంది పిల్లలు ఆయన ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. కానీ ఆ తర్వాత ఇలియానా వచ్చిన వెంటనే ఆమె ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. ఏదైనా సినిమా గ్లామరే కారణమని.. దాసరి వ్యాఖ్యానించడం దానికి ఆయన పక్కన ఉన్నవారు అవుననడం విశేషం. ఇకపోతే పోలీసు అధికారులు సైతం తమ పిల్లలను వెంకటేష్, ఇలియానాల దగ్గరకు తీసుకెళ్ళడం ఇందులో మరో ఆసక్తికరమైన అంశం.