అక్టోబర్ లో మహేష్-వెంటేష్ మల్టీస్టారర్ సినమా...!?
వెంకటేష్, మహేష్ బాబు కలిసి తొలిసారిగా ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారన్న వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ, ఆ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అన్న కుతూహలం అభిమానుల్లో నెలకొంది. ఆ శుభ సమయం వచ్చేస్తోంది. అక్టోబర్లో ఈ సినిమా ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో దిల్ రాజ్ నిర్మించే ఈ చిత్రం కోసం ఇప్పటికే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే టైటిల్ రిజిస్టర్ చేసి ఉంచారు. ప్రస్తుతం వెంకటేష్ తన 'గంగ ది బాడీగార్డ్' చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం మొదలవుతుందని అంటున్నారు. మహేష్ బాబు 'దూకుడు" హిట్ ఇవ్వడానికి రెడీ అవుతూనే మరో పక్క 'బిజినెస్ మెన్' సినిమా చేస్తూనే, మరోపక్క మధ్యలో ఈ సినిమాకు కొన్ని డేట్స్ ఇస్తాడని తెలుస్తోంది. దిల్ రాజ్ ప్రస్తుతం ఈ సినిమా మీద పూర్తి కాన్సంట్రేషన్ పెడుతున్నాడట!
More from Filmibeat
mahesh babu venkatesh srikanth addala dil raju dookudu మహేష్ బాబు వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల దిల్ రాజు దూకుడు


Click it and Unblock the Notifications











