Don't Miss!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వెంకటేష్, తేజ సినిమాపై గుసగుసలు.. కారణం అదేనట..
గురు సక్సెస్ తర్వాత విక్టరీ వెంకటేష్ మరో సినిమాకు చాలానే గ్యాప్ తీసేసుకున్నాడు. గురు అనంతరం అచితూచీ అడుగువేస్తూ దర్శకుడు తేజతో వెంకీ జతకట్టాడు. కానీ ఆ సినిమా ఎప్పుడో పట్టాలెక్కాల్సింది. అయితే ఈ సినిమా మరింత ఆలస్యం కానున్నదనే వార్త సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ చిత్ర కథ, స్క్రిప్టు విషయంలో వెంకటేష్ కొంత అసంతృప్తిగా ఉన్నాడట. అంతేకాకుండా పలు రకాల మార్పులు, చేర్పులను తేజకు సూచించినట్టు సమాచారం. దీంతో మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.
వెంకటేష్ మార్పులతో తేజ కథ, స్కిప్టుపై పునరాలోచనల పడినట్టు సమాచారం. దీంతో వెంకీ సినిమా మరింత ఆలస్యమవుతుందనే మాట వినిపిస్తున్నది. అంతేకాకుండా ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీయా సరన్ ఎంపిక చేశారు. ఇంతలో ఈ ముద్దుగుమ్మ రష్యా పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అత్తారింటికి చెక్కేయడం కూడా కొంత ఇబ్బందిగా మారింది.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వెంకటేష్ చిత్రాన్ని మే నెలలో షూటింగ్ వెళ్లే ఆలోచనతో తేజ ముందుకు సాగుతున్నట్టు తెలిసింది. ఈ లోపు ఎన్టీఆర్ బయోపిక్ ఓ షెడ్యూల్ను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.