twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెంకటేష్-నాగ చైతన్య మల్టీ స్టారర్ షురూ... తెరపై తడాఖా చూపబోతున్న మామ అల్లుడు!

    By Bojja Kumar
    |

    టాలీవుడ్లో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమలో మరో మల్టీస్టారర్ బుధవారం ప్రారంభోత్సవంజరుపుకుంది. వెంకటేష్-నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో బాబీ(కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించబోతున్న మూవీ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివి వినాయక్, రానా దగ్గుబాటి, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

    ఈ చిత్రంలో ఇద్దరు లీడ్ హీరోయిన్లు ఉండబోతున్నారు. చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ ఫైనల్ అవ్వగా.... వెంకటేష్ సరసన నటించే హీరోయిన్ ఎంపిక జరుగాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి ఇతర తారాగణం వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ తెలిపారు.

    Venkatesh, Naga Chaitanya multi-starrer launch

    వెంకటేష్ ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్‌తో కలిసి 'ఎఫ్ 2' అనే మరో మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మరో వైపు నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'సవ్యసాచి' చిత్రం విడుదలకు సిద్ధమైంది.

    English summary
    Venkatesh and Naga Chaitanya will now come together for the first time onscreen for a multi-starrer which will be directed KS Ravindra aka Bobby. Said to be a fun-entertainer subject, the yet untitled film will be bankrolled by Suresh Productions and People Media jointly. The film was launched officially today in Hyderabad at the popular Ramanaidu Studios.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X