Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వెంకటేష్ 'నాగవల్లి' విడుదల వాయిదా...ఆ వివాదంతోనే
ఈ గురువారం (డిసెంబర్ 16) విడుదల కానున్న వెంకటేష్ తాజా చిత్రం "నాగవల్లి" వాయిదా పడే అవకాశం ఉంది. గత నాలుగు రోజులుగా నిర్మాతలు అంతా షూటింగ్ లు ఆపుచేసి చేస్తున్న స్ట్రైక్ కు మద్దతుగా ఈ పోస్ట్ వేన్ వేస్తానని నిర్మాత బెల్లంకొండ సురేష్..నిర్మాతల మండిలికి లెటర్ ఇచ్చారు. అయితే ఫైనల్ డెషిసన్ రేపు (మంగళవారం) తేలనుంది. ఇక బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న కందిరీగ చిత్రం షూటింగ్ లోనే ఈ వివాదం మొదలైంది. నిబంధనలకు విరుద్దంగా స్ధానికేతరులకే సినిమాలో ఎక్కువ ప్రాముఖ్యత కల్పించారని ఆరోపిస్తూ స్ధానికంగా ఉన్న పలువురు సినీ ఫైటర్లు చెన్నై ఫైట్ మాస్టర్లపై దాడి చేయటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ ఘటనను నిరసిస్తూ తెలుగు సినిమా షూటింగ్ లన్నీ రద్దు చేస్తున్నట్లు సినిమా నిర్మాతల మండలి ప్రకటించింది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఛార్మినార్ వద్ద చిత్రీకరిస్తున్న కందిరీగ సినిమా షూటింగ్ లో చెన్నై, ఆంధ్రా ఫైటర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక తన చిత్రంతోనే వివాదం మొదలైంది కాబట్టి తన మరో చిత్రం కూడా విడుదల చేయటం నైతికంగా పద్దతి కాదనే ఆలోచనతో వచ్చి బెల్లంకొండ ఈ వాయిదా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.