Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వెంకటేష్ సరసన మరోసారి నయనతార(అఫీషియల్)
హైదరాబాద్ :వెంకటేష్ సరసన మరోసారి చేయటానికి నయనతార ఖరారయ్యింది. మారుతి దర్శకతత్వంలో రూపొందే రాధ చిత్రం కోసం ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిభ్రవరి 2014 నుంచి చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ఈ విషయం ఆయన అఫీషియల్ గా మీడియాకు తెలియచేసచారు. జనవరి 16న లాంచింగ్ ఉంటుందని తెలియచేసారు.
'రాధ'లో వెంకటేష్ హోం మినిస్టర్గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈచిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఉంటుందని తెలుస్తోంది. అవినీతి, కుళ్లు రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే కాన్సెప్టుతో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారట.
లేడీ టైటిల్స్తో గతంలో వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'లక్ష్మి'గా...ఆ తరువాత బోయపాటి శ్రీను రూపొందించిన చిత్రంలో 'తులసి'గా వచ్చిన వెంకీ మారుతి దర్శకత్వంలో 'రాధ' సినిమాతో కూడా ప్రేక్షకులను అలరిస్తాడని అంటున్నారు. సినిమా మొత్తం పూర్తిగా రాజకీయాలే కాకుండా ఫ్యామిలీ ఎంటర్టెనర్గా కూడా ఉండనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం మారుతి అల్లు శిరీష్ హీరోగా 'కొత్త జంట' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ కాపీ వచ్చాక ఈయనతో విక్టరీ వెంకటేష్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. సంక్రాంతికి 'రాధ' సినిమా షూటింగ్ లాంచనంగా ప్రారంభించి మార్చి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపాలనే ప్లాన్లో ఉన్నాడట మారుతి.