twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'వెంకీ' నెక్ట్స్ స్నేహం ప్రధానంశంగా..

    By Staff
    |

    Venkatesh
    స్నేహం ప్రధానాంశంగా రజనీకాంత్...జగపతిబాబు ప్రధాన పాత్రల్లో చేసిన 'కథానాయుకుడు' భాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. అయితే ఇప్పుడు మళ్ళీ వెంకటేష్,క్రిష్ కాంబినేషన్ లో రూపొందనున్న 'కృష్ణం వందే జగద్గురం' చిత్రం కూడా ఫ్రెండ్ షిప్ నేపధ్యంలో సాగుతుందని విశ్వసనీయంగా తెలుస్తుంది. అయితే వెంకటేష్ తో స్నేహం చేయబోయేది త్రిషానా లేక మరొకరా అనేది తెలియాల్సి ఉంది.

    గమ్యం చిత్రంతో క్రిటిక్స్ ప్రశంసలు సైతం పొందిన జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) ఈ స్క్రిప్ట్ ని తన ఆస్ధాన రచయిత నాగరాజుతో అధ్బుతంగా తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. వాస్తవానికి దగ్గరగా ఉంటూనే,వెంకటేష్ తరహా కామిడీని ఈ చిత్రంలో ఇమడ్చటానికి ప్రయత్నించారని సమాచారం. ఇక త్వరలో ఫ్రారంభం కానున్న ఈ సినిమాలో త్రిష ...మరో ముఖ్య పాత్రను పోషించనుంది. వైజయింతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే క్రిష్ కూడా తెలుగు సినీ దర్శకుడు రెగ్యులర్ గా ఎదుర్కొనే రెండో సినీ గండాన్ని దాటుతాడని అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X