Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వెంకీ, బ్రహ్మీ, కాజల్...కడుపు చెక్కలయ్యే స్కిట్!
హైదరాబాద్: హుధూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు నిధుల సేకరణలో భాగంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఈ నెల 30న ‘మేము సైతం' పేరుతో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్స్ క్రికెట్, వినోద కార్యక్రమాల లాంటి నిర్వహిస్తున్నారు. వీటికి టికెట్స్ విక్రయించడం ద్వారా నిధులు సేకరిస్తున్నారు.
ఇందులో పలువురు స్టార్స్ వివిధ కార్యక్రమాలతో అలరించబోతున్నారు. వెంకటేష్, బ్రహ్మానందం, అలీ కాజల్ కలిసి ‘పెళ్లి కాని ప్రసాద్' పేరుతో స్కిట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కిట్ ప్రేక్షకులను కుడుపు చెక్కలయ్యేలా నవ్విస్తుందని అంటున్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ రకాల కార్యక్రమాలు ఎన్ని ఉన్నా.....అందరూ ఓ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది మరేదో కాదు.....మహేష్ బాబు, త్రివిక్రమ్, పవన్ కళ్యాన్ కలిసి చేసే స్కిట్ కోసం. అసలు వీరిలో ఏ ఒక్కరు స్కిట్ చేసినా అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. అలాంటిది ముగ్గురు కలిసి స్కిట్ చేస్తే టాప్ లేచి పోవాల్సిందే. సోమవారం జరిగిన మేము సైతం ప్రెస్ మీట్లో నిర్మాత సురేష్ బాబు ఈ స్కిట్ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు.
పవన్, త్రివిక్రమ్, మహేష్ బాబు కలిసి ఓ స్కిట్ చేస్తారు. అదే విధంగా ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి కలిసి మరో స్కిట్ చేస్తున్నారు. మంచు విష్ణు, మనోజ్ రెండు టీములుగా విడిపోయి కబడ్డీ ఆడుతున్నారు అని సురేష్ బాబు తెలిపారు.
క్రికెట్ మ్యాచ్ విషయానికొస్తే..... స్టార్స్ అంతా మొత్తం నాలుగు జట్లుగా ఏర్పడనున్నారు. ఈ జట్లకు వెంకటేష్, నాగార్జున, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. బిడ్డింగ్ ప్రాసెస్లో వేలం ద్వారా ఆయా జట్లకు ఆటగాళ్ల ఎంపిక జరుగుతోంది. జట్లలో హీరోలతో పాటు, హీరోయిన్లు కూడా ఉండనున్నారు. నవంబర్ 27న జట్ల ఎంపక జరుగుతుంది.
బిడ్డింగ్ ప్రాసెస్ లో జట్ల ఎంపిక కార్యక్రమం ఈ నెల 27న రాత్రి 9 గంటల నుండి 10 గంటల మధ్యలో జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో కెప్టెన్లు తమ జట్టు సభ్యులను ఎంచుకుంటారు. క్రికెట్ మ్యాచ్ ఆడే స్టార్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
హీరోలు : రవితేజ, అల్లరి నరేష్, నారా రోహిత్, మంచు మనోజ్, గోపీచంద్, కల్యాణ్ రామ్, నాని, నితిన్, నాగ శౌర్య, నిఖిల్, మంచు విష్ణు, తరుణ్, రాజశేఖర్, ఆది, సందీప్ కిషన్, సచిన్ జోషి, సుశాంత్, వరుణ్ సందేశ్, అఖిల్, సాయి ధరమ్ తేజ్, , తారకరత్న, శ్రీకాంత్, ఆదర్శ్, ఖయ్యుం, ప్రిన్స్, సుమంత్, అజయ్, సుధీర్ బాబు తదితరులు.
హీరోయిన్లు : అనుష్క, సమంత, కాజల్, హన్సిక, ప్రణీత, రాకుల్ ప్రీత్ సింగ్, చార్మి, ప్రియమణి, అర్చన, స్వాతి, రాశి ఖన్నా తదితరులు.