Don't Miss!
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'విశ్వరూపం' కి దక్కనిది వెంకీ 'షాడో' కి
హైదరాబాద్ : త్వరలో విడుదల కాబోతున్న వెంకటేష్ తాజా చిత్రం 'షాడో' మరో ప్రత్యేకతను సంతరించుకోబోతోంది. ఈ సినిమాను 'ఆరో త్రీడీ' అనే శబ్ద విధానం ద్వారా తెరపైకి తీసుకురాబోతున్నారు. మొదట 'విశ్వరూపం' చిత్రాన్ని ఆరో త్రీడీలోనే ప్రేక్షకులకు చూపించాలనుకొన్నారు. సాధ్యపడలేదు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో దక్షిణాదిన విడుదలవుతున్న మొదటి చిత్రం 'షాడో'. ఈ నెల 26న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ''ఈ వేసవిలో షాడోతో ఇంటిల్లిపాదికీ వినోదాలు పంచుతాను. దర్శకుడు మెహర్ రమేష్ ప్రతి సన్నివేశాన్నీ ఎంతో అందంగా చూపించే ప్రయత్నం చేశారు. తమన్ సంగీతం చాలా బాగుంది''అన్నారు. వెంకీకి ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.
మెహర్ రమేష్ మాట్లాడుతూ ''యూత్ తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తుంది ఈ చిత్రం. ఆరో 11.1 త్రీడీ శబ్దంతో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని కలగజేస్తుంది''అన్నారు. నిర్మాత పరుచూరి శివరామప్రసాద్ మాట్లాడుతూ ''ఈ వేసవిలో విందు భోజనం లాంటి చిత్రమిది. పాటలకు మంచి స్పందన వస్తోంది''అన్నారు.
నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: కోనవెంకట్, గోపిమోహన్. మాటలు: కోనవెంకట్, మెహర్ రమేష్, సంగీతం: తమన్. కెమెరా: ప్రసాద్, మూరెళ్ల, ఎడిటింగ్, మార్తాండ్, కె.వెంకటేష్. ఆర్ట్: ప్రకాష్ ఏ ఎస్. ప్రొడక్షన్ కంట్రోలర్: పి. అజరుకుమార్ వర్మ, నిర్మాత: పరుచూరి కిరీటి, దర్శకత్వం: మెహర్ రమేష్.