Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెంకి 'షాడో' ఆడియో విడుదల తేదీ,వెన్యూ
హైదరాబాద్ : వెంకటేష్, తాప్సీ జంటగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో పరుచూరి శివరామప్రసాద్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'షాడో' చిత్రం వచ్చే నెల్లో విడుదల కోసం శరవేగంతో సిద్ధమవుతోంది. ఈ సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పరుచూరి కిరీటి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం గురించి వెంకటేష్ మాట్లాడుతూ"మంచి టీమ్తో చేస్తున్న సినిమా. మెహర్ మంచి ఎనర్జీతో తెరకెక్కిస్తున్నారు. మాస్తో పాటు ఫ్యామిలీని ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి' అన్నారు.
దర్శకుడు మెహర్ రమేశ్ మాట్లాడుతూ "అన్ని వర్గాల వారినీ దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించాం. వినోదం కలగలసిన యాక్షన్ సినిమా ఇది. మలేషియాలో ఛేజ్ సీన్ను వెంకటేష్, శ్రీకాంత్ రిస్క్ తీసుకుని చేశారు. నాగబాబు, ఎమ్మెస్ నారాయణ పాత్రలు మెప్పిస్తాయి. వెంకటేష్గారితో పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రాన్ని చేయాలని ఎప్పట్నుంచో అనుకున్నాను. అది ఇప్పటికి నెరవేరింది'' అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ "సినిమా చక్కగా వచ్చింది. ఎడిటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. మార్చి 7న శిల్పకళావేదికపై ఆడియో వేడుకని నిర్వహించనున్నాం. అదే నెల 27నగానీ, 29నగానీ సినిమాను విడుదల చేస్తాం. 'సింహా'ను దాటి పెద్ద చిత్రంగా నిలుస్తుంది. సింగిల్ సిట్టింగ్లో వెంకటేష్గారు కథను ఓకే చేశారు. ఆయనలోని మాస్ కోణాన్ని చూపించే సినిమా ఇది'' అని తెలిపారు.
అలాగే - హై ఓల్టేజ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఇది. వినోదానికి పెద్దపీట వేసి రూపొందించామన్నారు. థమన్ చక్కని సంగీతం అందించారన్నారు. ఇటీవల రిజలైజన టీజర్కి ముఖ్యంగా టైటిల్ ట్రాక్కు అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. వెంకటేష్ చాలా స్టైలిష్గా కనిపిస్తారన్నారు. ఆయన కెరీర్లోనే ఇది వైవిధ్యమైన చిత్రమన్నారు. జనవరి నెలాఖరు వరకు చివరి షెడ్యూల్ చిత్రీకరణ సాగుతుందన్నారు.
మధురిమ, ఎమ్మెస్ నారాయణ, నాగబాబు, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్యమీనన్, ధర్మవరపు, ముఖేష్ రుషి, ప్రభు, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ:కోన వెంకట్, గోపిమోహన్, మాటలు:కోన వెంకట్, మెహర్ రమేష్, పాటలు:చంద్రబోస్, రామజోగయ్య శాస్ర్తీ, కెమెరా:ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: థమన్, ఫైట్స్: రామ్ -లక్ష్మణ్, హ్యారీ (సిడ్నీ), ఎడిటింగ్:మార్తాండ్.కె, డాన్స్ రాజు, కథనం - దర్శకత్వం: మెహర్ రమేష్.