Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వెంకీ, తేజ మూవీ ముహూర్తం ఫిక్స్... హీరోయిన్గా అనుష్క? రానా గెస్ట్?
విక్టరీ వెంకటేష్, తేజ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాకు ముమూర్తం ఖరారైంది. ఈ చిత్రాన్ని నవంబర్ 16 లాంచ్ చేయబోతున్నారు. హీరోయిన్ గా అనుష్కను ఎంపిక చేసే అవకాశం ఉంది.
తన వయసుకు తగిన పాత్రలు ఎంచుకుంటూ, సెలెక్టెడ్గా సినిమాలు చేస్తూ వెలుతున్న విక్టరీ వెంకటేష్ త్వరలో తేజ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రరంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.
ఈ చిత్రాన్ని నవంబర్ 16న లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అయితే ఇది మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
తేజ పనితనం నచ్చి ఓకే చెప్పిన వెంకీ
రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి' సినిమాను తెరకెక్కించిన తేజ పనితనం చూసిన వెంకీ ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం, వెంటనే తేజ ఒక కథ చెప్పడం, వెంకీకి నచ్చడంతో ఈ కాంబినేసన్ ఓకే అయిపోయింది.
హీరోయిన్గా అనుష్క?
ఈ చిత్రంలో వెంకీ సరసన అనుష్క నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో వెంకటేష్, అనుష్క కలిసి చింతకాయల రవి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
గెస్ట్ పాత్రలో రానా?
ఈ చిత్రంలో రానా కూడా గోస్ట్ రోల్ చేయబోతున్నారని సమాచారం. రానా కోసం తేజ ప్రత్యేకంగా ఓ పాత్రను రాసినట్ల, సినిమాలో ఆ పాత్ర హైలెట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు.
మల్టీ స్టారర్ మూవీ?
ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రం మల్టీ స్టారర్గా రూపొందబోతోందని, నారా రోహిత్ లేదా సుమంత్ కీలకమైన పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అఫీషియల్ ప్రకటన వెలువడితే తప్ప ఏ విషయం అనేది చెప్పడం కష్టం.