క్రేజీ మల్టీస్టారర్కు ముహూర్తం కుదిరింది.. దేవిశ్రీ రంగంలోకి దిగాడు!
టాలీవుడ్ లో ప్రతుతం మల్టీస్టారర్ల కాలం నడుస్తోంది. రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నాని, నాగార్జున ఓ చిత్రంలో నటిస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా కమర్షియల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకతంలో ఎఫ్2 అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్ర ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. జూన్ 23 న ఈ చిత్రాన్ని లాంచ్ చేయనున్నారు. పూర్తి స్థాయి వినోదాత్మక అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటించనున్నారు.

ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తునడం విశేషం. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ తో దర్శకుడు అనిల్ రావిపూడి మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.


Click it and Unblock the Notifications











