Don't Miss!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
కొడుకు అర్జున్పై పుకార్లు: వెంకటేష్ ఇలా స్పందించారు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో 'గోపాలా గోపాలా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్ కొడుకు అర్జున్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యులు కొందరు అర్జున్ అతిథి పాత్రలో నటించే అవకాశం ఉందని అనడంతో అంతా నిజమే అని అనుకున్నారు.
అర్జున్ బాల నటుడిగా వెండి తెరపై కనిపించబోతున్న తొలి సినిమా ఇదే అంటూ వార్తలు జోరందుకున్నాయి. వెంకీతో కలిసి పలు సీన్లలో అర్జున్ కనిపించబోతున్నాడని, అర్జున్ కనిపించే సీన్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారని, ఈ మేరకు ఇప్పటికే అర్జున్కు ఎలా యాక్ట్ చేయాలనే విషయంలో ట్రైనింగ్ ఇచ్చినట్లు పుకార్లు షికార్లు చేసాయి.
అయితే ఈ వార్తలపై వెంకటేష్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో అర్జున్ నటించడం లేదని స్పష్టం చేసారు. హాలిడేస్ కావడంతో 'గోపాలా గోపాలా' సినిమా ప్రారంభోత్సవానికి అర్జున్ వచ్చినట్లు తెలిపారు. సినిమాలో నటించడం లేదని తేల్చి చెప్పారు.
దగ్గుబాటి అర్జున్
ఇటీవల ‘గోపాలా గోపాలా' చిత్రం ప్రారంభోత్సవంలో అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
నిర్మాణం
'సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా 'గోపాలా ...గోపాలా' చిత్రం నిర్మిస్తున్నాయి. ఇటీవలే ఈచిత్ర ప్రారంభోత్సవం జరిగింది.
తారాగణం
నాయికగా 'శ్రియ' నటిస్తుండగా ప్రధాన పాత్రలలో..మిదున్ చక్రవర్తి, పోసాని కృష్ణ మురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్, పృథ్వి, దీక్షా పంత్, నర్రా శీను, రమేష్ గోపి, అంజు అస్రాని.
సాంకేతిక విభాగం
'గోపాల..గోపాల' చిత్రానికి కధ - భవేష్ మందాలియ, ఉమేష్ శుక్ల, స్క్రీన్ ప్లే- కిషోర్ కుమార్ పార్ధసాని, భూపతి రాజా, దీపక్ రాజ్, కెమెరా - జయనన్ విన్సెంట్, మాటలు - సాయి మాధవ్, సంగీతం - అనూప్ రూబెన్స్, పాటలు - చంద్ర బోస్, ఎడిటింగ్ - గౌతం రాజు, ఆర్ట్ - బ్రహ్మకడలి, కొరియో గ్రఫీ - సుచిత్ర చంద్రబోస్, కో డైరెక్టర్స్ - పూసల రాధాకృష్ణ, వై.శ్రీనివాస రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జి క్యుటివ్స్ - వీరేన్ తంబి దొరై, భాస్కర రాజు, అభిరామ్.