వెంకటేష్-క్రిష్ ల ప్రాజెక్టు 'కృష్ణం వందే జగత్ గురుమ్' చిత్రం అక్టోబర్ మొదటి వారం నుండి ప్రారంభం కానుందని రూఢీగా తెలుస్తోంది. ఇక వెంకటేష్ తాజాగా చేస్తున్న చింతకాయల రవి ఫినిషింగ్ స్టేజీకి వచ్చింది.అంటే దాదాపు ఆరు నెలల వ్యవధిలో రెండు సినిమాలను వెంకీ రిలీజుకు రెడీ చేస్తున్నాడు. ఇక విమర్శకుల ప్రశంసలు పొందిన గమ్యం చిత్రం దర్శకుడు క్రిష్ ఇప్పటికే ఈ స్క్రిప్టు ని చాలా బాగా మలిచాడని వార్తలు వినవస్తున్నాయి .అలాగే సూపర్ హిట్ ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రంలో వెంకీ సరసన చేసిన త్రిష మళ్ళీ ఈ సినిమాతో జతకట్టడం మరింత క్రేజ్ కి కారణమయ్యింది. ఈ సినిమాకున్న మరో స్పెషాలిటీ మొదటిసారిగా సురేష్ బాబు...అశ్వనీదత్ సినిమాను సమర్పించటం.